Political News

యువ‌గ‌ళం ఆషామాషీ కాదు బ్రో

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. అహ‌ర‌హం శ్ర‌మిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంత‌రం ఆయ‌న స‌మీక్షించుకుంటున్నారు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి క్విక్‌గా త‌యారై.. వెంట‌నే సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఎంత మంది వ‌చ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతంలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

దీనిపై ప్ర‌త్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి క‌నిపించేవి కొన్ని ఉంటే.. క‌నిపించ‌నవి ఈ యాత్ర‌లో చాలానే ఉంటున్నాయి. కొన్ని సామాజిక వ‌ర్గాల‌కు నారా లోకేష్ ఇచ్చిన హామీల‌ను త‌న డైరీలో ప్ర‌త్యేకంగా ఆయ‌న రాసుకుంటున్నారు. అదేవిధంగా యువ‌త‌కు ఏటా జాబ్ క్యాలెండ‌ర్, మ‌హిళ‌ల‌కు వ్య‌క్తిగ‌త రుణాలు, వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి ఎస్టీ హోదా.. వంటివాటిని మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

ఇక‌, సాయంత్రం పాద‌యాత్ర ముగించిన త‌ర్వాత‌.. శిబిరానికి చేరుకుని.. అక్క‌డే ఉన్నా.. రెస్ట్ తీసుకోకుండా.. రోజంతా జ‌రిగిన పాద‌యాత్ర వివ‌రాల‌ను రాసుకుంటున్నారు. వాటినే మీడియాకు పంపిస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీప‌రంగా యాక్టివ్‌గా ఉన్న నాయ‌కులు ఎవ‌రు.. ఎవ‌రెవ‌రు.. ఎంత సేపు యాత్ర‌లో పాల్గొంటున్నారు. ప్ర‌జ‌ల‌ను ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? వంటి అన్ని విష‌యాల‌ను కూడా నారా లోకేష్ న‌మోదు చేసుకుంటున్నారు.

ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చింద‌ని భావించినా.. ఆయ‌న శిబిరానికి పిలిచి నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తున్నట్టు స‌మాచారం. అంతేకాదు.. ఇప్ప‌టి వర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించిన అనంత‌పురం, చిత్తూరు, క‌ర్నూలు జిల్లాల్లో వైసీపీ లోటు పాట్లు, ఎమ్మెల్యేల వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను కూడా అడిగి తెలుసుకున్నారు. త‌ద్వారా.. వారికి దీటైన అభ్య‌ర్థుల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున టికెట్‌లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. యువ‌గ‌ళం అంత ఆషామాషీగా అయితే.. నిర్వ‌హించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on June 3, 2023 1:53 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 mins ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

2 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

2 hours ago

20 వసంతాల ‘ఆర్య’ చెప్పే కబుర్లు

ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…

2 hours ago

సుహాస్ లెక్క తప్పుతోంది ఇక్కడే

కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…

3 hours ago

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

4 hours ago