Political News

పొత్తులు లేకుంటే అంతే.. బీజేపీ నేత‌ల గుస‌గుస‌…!

వ‌చ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒక‌టో రెండో పార్ల‌మెంటు స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని బీజేపీ నాయ‌కులు త‌ల‌పోస్తున్నారు. ఈ విష‌యంలో ప్ర‌స్తుతం క‌మ‌ల నాథుల‌తో క‌లిసి న‌డుస్తున్న జ‌న‌సేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బ‌త‌కండి.. మ‌మ్మ‌ల్ని బ‌తికించండి.. అంద‌రం క‌లిసి అధికారంలోకి వ‌ద్దాం.. అని చెబుతోంది.

అయితే.. ఈ విష‌యంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కేంద్రంలోని పెద్ద‌లు అనుస‌రించే వ్యూహాల మేర‌కు.. వారు అడుగులు వేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌స్తుతం లోపాయికా రీగా వైసీపీతో క‌లిసి ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనివ‌ల్ల ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన న‌ష్టం లేక‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇలానే వ్య‌వ‌హ‌రిస్తే.. న‌ష్ట‌పోయేది బీజేపీనేన‌ని అంటున్నారు క‌మ‌ల నాథులు.

“మాలో మాకే క్లారిటీ లేదు. వైసీపీని న‌మ్ముకుంటే.. లోపాయికారీగా అయినా.. ఆ పార్టీతో అడుగులు వేస్తే.. న‌ష్ట‌పోవ‌డం ఖాయం. వైసీపీ మాత్రం మాకు ప్ర‌త్య‌క్షంగా ఎలాంటి మ‌ద్ద‌తు ఇవ్వ‌దు. ఈ విష‌యంలో మావాళ్ల‌కు కూడా క్లారిటీ ఉంది. కానీ, ఆ పార్టీని ప‌ట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అర్ధం కావ‌డం లేదు. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా.. వ్యూహాలు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది“ అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క బీజేపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు.

ఇటీవ‌ల ఆయ‌న ఓ కీల‌క ఎన్నిక‌లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అదే.. టీడీపీతో అంతో ఇంతో చ‌నువుగా ఉండి ఉంటే.. తాను గెలుపు గుర్రం ఎక్కేవాడిన‌ని అన్నారు. ఇదే అభిప్రాయంతో సీమ బీజేపీ నాయ‌కులు కూడా ఉన్నారు. ముఖ్యంగా క‌డ‌ప, అనంత‌పురంలో పావులు క‌దుపుతున్న బీజేపీ నాయ‌కు లు.. పొత్తులు లేకుంటే.. న‌ష్ట‌పోతామ‌ని కూడా చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి వేళ్లూ సోము వీర్రాజువైపే ఉన్నాయి. ఆయ‌న చొర‌వ తీసుకుని.. పార్టీ కోసం ప‌నిచేయాల‌నే వారు పెరుగుతున్నారు.

This post was last modified on May 23, 2023 4:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago