వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒకటో రెండో పార్లమెంటు స్థానాల్లోనూ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు తలపోస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం కమల నాథులతో కలిసి నడుస్తున్న జనసేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బతకండి.. మమ్మల్ని బతికించండి.. అందరం కలిసి అధికారంలోకి వద్దాం.. అని చెబుతోంది.
అయితే.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. కేంద్రంలోని పెద్దలు అనుసరించే వ్యూహాల మేరకు.. వారు అడుగులు వేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం లోపాయికా రీగా వైసీపీతో కలిసి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలానే వ్యవహరిస్తే.. నష్టపోయేది బీజేపీనేనని అంటున్నారు కమల నాథులు.
“మాలో మాకే క్లారిటీ లేదు. వైసీపీని నమ్ముకుంటే.. లోపాయికారీగా అయినా.. ఆ పార్టీతో అడుగులు వేస్తే.. నష్టపోవడం ఖాయం. వైసీపీ మాత్రం మాకు ప్రత్యక్షంగా ఎలాంటి మద్దతు ఇవ్వదు. ఈ విషయంలో మావాళ్లకు కూడా క్లారిటీ ఉంది. కానీ, ఆ పార్టీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికిప్పుడు కాకపోయినా..వచ్చే ఎన్నికల నాటికైనా.. వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది“ అని ఉత్తరాంధ్రకు చెందిన కీలక బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు.
ఇటీవల ఆయన ఓ కీలక ఎన్నికలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అదే.. టీడీపీతో అంతో ఇంతో చనువుగా ఉండి ఉంటే.. తాను గెలుపు గుర్రం ఎక్కేవాడినని అన్నారు. ఇదే అభిప్రాయంతో సీమ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కడప, అనంతపురంలో పావులు కదుపుతున్న బీజేపీ నాయకు లు.. పొత్తులు లేకుంటే.. నష్టపోతామని కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి వేళ్లూ సోము వీర్రాజువైపే ఉన్నాయి. ఆయన చొరవ తీసుకుని.. పార్టీ కోసం పనిచేయాలనే వారు పెరుగుతున్నారు.
This post was last modified on May 23, 2023 4:49 pm
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.…
స్పెషల్ సాంగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా చాలా గ్యాప్ తర్వాత ఛాలెంజింగ్ రోల్ ఒకటి దక్కించుకుంది.…
గత గురువారం మరి కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమయర్స్ పడాల్సి ఉండగా.. అనూహ్యంగా అఖండ-2 సినిమాకు బ్రేక్…
రాజకీయాల్లో నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. వీటికి తోడు సానుభూతి, గౌరవం,…
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న దురంధర్ మొదటి వారం తిరక్కుండానే నూటా యాభై…
గత నెలలో ఏపీలోని విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకు పోటీ పడుతున్నట్టుగా.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు రోజలు…