Political News

కమ్మ.. రెడ్డి..కాపులు ఒక్కరే.. షాకిచ్చే నిజాన్ని చెప్పిన పెద్దాయన

తెలుగు రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చినా ఆ వెంటనే వచ్చే పదాల్లో ముఖ్యమైనవి కాపు.. కమ్మ.. రెడ్డి. ఈ మూడు పేర్లు పలకకుండా రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి. తెలుగు ప్రజల జీవితాల్లో అంతలా పెవేసుకున్న ఈ మూడు కులాల నేపథ్యం ఏమిటి? ఇంతకీ ఈ మూడు కులాలకు ఉన్న తేడా ఏమిటి? అసలీ మూడు కులాల ఉనికి ఎప్పటి నుంచి ఉండేదన్న దానికి సంబంధించి సంచలన నిజాల్ని వెల్లడించారు చారిత్రక పరిశోధకుడు.. తెలుగు ప్రాంతాల చరిత్ర గురించి పలు పుస్తకాలు రాసిన ప్రముఖుడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్.

తెలుగు వారికి చరిత్ర అన్నదే లేదనే మాటకు భిన్నంగా.. అందరికి అర్థమయ్యేలా ఆయన చరిత్రను తేలిగ్గా అర్థమయ్యేలా పెద్ద ఎత్తున పుస్తకాలు రాసిన ప్రముఖుడిగా ఆయన్ను చెప్పొచ్చు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన నిజాన్ని వెల్లడించారు. తాను చారిత్రక పరిశోధకుడినని చెబుతూ. ‘‘ఎనిమిదో శతాబ్దం నాటికి కాపు.. కమ్మ.. రెడ్డి కులాలు వేర్వేరు కావు. దాని తర్వాతే అవి మూడుగా మారాయి. కాపు అంటే పొలాలను కాపు కాసేవారు. రెడ్డి అంటే రట్టోడి.. రాష్ట్రకూటులు వీరు. దేశానికి రెడ్లు రక్షణ కల్పించారు. కమ్మవాళ్లకు కరికాల చోళుడికి లింకులు ఉన్నట్లుగా శాసనాలు లభించాయి’’ అని చెప్పుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ ప్రాంతాన్ని కమ్మవాళ్లు పాలించారని దీనికి సాక్ష్యంగా ముమ్మడి నాయకుని శాసనం ఉందని చెప్పారు. అప్పట్లో కనౌజ్ ప్రాంతాన్ని కన్యా కుబ్జా అని పిలిచేవారని.. దాన్ని కమ్మ వాళ్లు పాలించారన్నారు. రాజ్యాధికారం కోసం ఈ మూడు కులాలు మెల్లిమెల్లిగా విడిపోయినట్లు చెప్పారు. కళా రంగంలో ఏపీకి చాలా అన్యాయం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చాలామంది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా ఇవ్వలేదన్నారు. ‘‘ఆ మహాపురుషుడికి కులాన్ని అపాదించి భారతరత్న రాకుండా చేశారన్నారు. ఎంజీఆర్ కు భారతరత్న ఇవ్వటంలో ఉన్న లాజిక్ ఏమిటి? ద్రవిడ రాజకీయాల్లో ప్రయోజనం కోసం ఆయనకు భారతరత్న ఇవ్వొచ్చు. సచిన్ టెండూల్కర్.. లతా మంగేష్కర్ కు భారతరత్న ఇస్తారు. ఎన్టీఆరర్ కు మాత్రం ఇవ్వరు. అనాదిగా ఆంధ్రులు వాళ్లు చేయని తప్పులకు అనాదిగా శిక్ష అనుభవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

This post was last modified on May 22, 2023 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

2 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

6 hours ago