Political News

జ‌గ‌న్‌కు త‌ల్లి-చెల్లి అందుకే దూర‌మ‌య్యారు

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత‌న‌ని గొప్ప‌గా చెప్పుకొనే జ‌గ‌న్‌కు ఇప్పుడు త‌న త‌ల్లి-చెల్లి ఎందుకు దూర‌మ‌య్యారో చెప్పే ధైర్యం ఉందా? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ అరాచ‌కాలు చూసి.. విసిగిపోయి వారంతా ఎప్పుడో జ‌గ‌న్‌ను వ‌దిలేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆస్తి వివాదాల్లో ఏకంగా.. త‌ల్లిని, చెల్లిని కూడా జ‌గ‌న్ దూషించార‌ని.. వైసీపీ నాయ‌కులే త‌న‌తో చెప్పార‌ని వ్యాఖ్యానించారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించని సీఎం జగన్‌… రాయలసీమకు శాపమని లోకేష్‌ ధ్వజమెత్తారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 102వ రోజు నంద్యాల నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని ప్రజలతో మాట్లాడు తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నంద్యాలలోని టీడీపీ శ్రేణులు లోకేశ్కు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అక్రమాలను ఎండగట్టారు. ప్ర‌జ‌ల‌కు ఏం చేశార‌ని.. వైసీపీ నేత‌ల‌కు ఓట్లే యాల‌ని నిల‌దీశారు. ఇస‌క దోపిడీ.. మ‌ట్టి దోపిడీ.. మ‌ద్యం పేరుతో నిధుల దోపిడీ చేస్తున్న వైసీపీ నేత‌ల‌కు ఎందుకు ఓట్లు వేయాలో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని సూచించారు. జగన్ అరాచకాలు చూసి తల్లి, చెల్లి సైతం దూరంగా వెళ్లారని, అందుకే ఒంటరయ్యారని లోకేష్ ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం హయాంలోనే నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నఆయ‌న‌… ఈ నాలుగేళ్ల కాలంలో 10 శాతం పనులు కూడా చేయలేదని విమర్శించారు. సండే ఎమ్మెల్యే పాలనలో నంద్యాలలో నేరాలు బాగా పెరిగాయని.. కానిస్టేబుల్ సురేంద్రను వైసీపీ నేతలు కిరాతకంగా చంపారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సురేంద్రను చంపినవారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. అలాగే రైతులకు చెందిన 3,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతారా? ఎమ్మెల్యే, ఎంపీ భూములు మాత్రం తీసుకోరా? అని లోకేశ్‌ ప్రశ్నించారు.

This post was last modified on May 18, 2023 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago