ఆయన మూడేళ్ల పాటు మంత్రిగా చేశారు. వైసీపీలో తిరుగులేని నాయకుడని అనిపించుకున్నారు. ఇప్పుడు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. మనకొద్దీ వైసీపీ అనుకుంటూ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.
అవంతీ శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో, అందులోనూ వైసీపీలో నిన్న మొన్నటి దాకా కీలక నేత. సాధారణంగా పదవి పోతే ఏ నేతకైనా ప్రాధాన్యం తగ్గడం సహజమే కానీ అవంతి పరిస్థితి దారుణంగా ఉంది. సొంతపార్టీ నాయకులు కూడా పలకరించడం లేదు. పొమ్మనలేక పొగబెడుతున్నారని ఇప్పటికే ఆయనకో స్పష్టత వచ్చేసింది. జిల్లాలో ఆయనకు గౌరవం దక్కడం సంగతి పక్కన పెడితే.. సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ సీటు ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా వచ్చేసింది.
గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన అవంతి 2019లో అధికారంలోకి వచ్చాక.. మూడేళ్లపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నం చేశారనే వాదన ఉంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోయాక.. అవంతికి విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. కానీ.. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. మాజీ మంత్రి ప్లేస్లో జిల్లా వైసీపీ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబుకు అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే అవంతి వర్గం మొత్తం పక్కకు వెళ్లాల్సి వచ్చింది. తన వర్గాన్ని పక్కన పెట్టడం మాజీ మంత్రికి మింగుడు పడలేదు. ఆ తరువాత పార్టీ ఆఫీసు గుమ్మం తొక్కడం తగ్గించేశారు. ఇదే సందు అనుకుని ఆయనను అసలు పిలువడం మానేశారు
ఆ మధ్య బయటకు వచ్చిన ఆడియో టేపులతో అవంతి పరువు పోయింది.ఇక వైసీపీలో ఉండి ప్రయోజనం లేదని అవంతి అనుకున్నారట. టీడీపీలో చేరే అవకాశం లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. కమలం పార్టీకి కూడా నాయకులు కావాల్సి రావడంతో ఎలాంటి షరతులు లేకుండా చేర్చుకునేందుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు.
This post was last modified on May 14, 2023 6:50 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…