తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారం చలాయిస్తూ.. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు గెలుస్తూ.. తమకు మెజారిటీ లేని చోట కూడా వక్ర మార్గాల్లో అధికారం చేజిక్కించుకుంటూ దేశ రాజకీయాల్లో ఆధిపత్యాన్ని చాటుతూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీకి శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం బీజేపీ చేజారింది.
ఆ పార్టీ ఓటమి ఊహించిందే కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని.. కాంగ్రెస్ పార్టీ అంత ఘనంగా గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ అసెంబ్లీని సూచించాయి. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. బీజేపీని వ్యతిరేకించే వారంతా ఈ రోజు మామూలు ఆనందంలో లేరు. ఆ పార్టీ అంటే అస్సలు పడని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సంబరం గురించి చెప్పేదేముంది?
చాలా ఏళ్ల నుంచి ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బీజేపీకి వ్యతిరేకంగా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నాడు ప్రకాష్ రాజ్. కొన్నిసార్లు ఆయన ట్వీట్లు శ్రుతి మించాయి కూడా. ఈ మధ్యే మోడీని హిట్లర్తో పోలుస్తూ ఆయన వేసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మోడీ, యోగి, అమిత్ షా మొత్తం బీజేపీ సరంజామా అంతా ఒక బండిలో సర్దుకుని వెళ్లిపోతున్నట్లుగా ఉంది ఆ ట్వీట్. ద్వేషం నిండిన, విభజిత రాజకీయాలు చేసే బీజేపీని తన్ని తరిమేసిన కన్నడిగులకు కృతజ్ఞతలు అంటూ.. చక్రవర్తిని నగ్నంగా నిలబెట్టారని అతను పేర్కొన్నాడు. బీజేపీ వ్యతిరేకులకు ఈ ట్వీట్ బాగా నచ్చి దాన్ని వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఉదయం నుంచి బీజేపీ మీద, మోడీ మీద సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ అయితే మామూలుగా లేదు.
This post was last modified on May 14, 2023 6:45 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…