ఒకవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే.. అదే సమయంలో మరో వైపపు రిసార్ట్ రాజకీయాలకు ప్రధాన పార్టీలు తెరదీశాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఉదయం 11 గంటల సమయా నికి కాంగ్రెస్ 115 స్థానాల్లోను, బీజేపీ 78 స్థానాల్లోను, జేడీఎస్ 24 స్థానాల్లోనూ ముందంజలో ఉంది.
దీంతో రిసార్టు రాజకీయాలు పుంజుకున్నాయి. దీనికి కారణం మేజిక్ ఫిగర్ 113కు ఏ పార్టీ కూడా చేరువయ్యే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పుంజుకున్నా.. 115 స్థానాలకే పరిమితం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇదే జరిగితే.. జేడీఎస్ మరోసారి కీలకం కానుంది. ఎట్టి పరిస్థితిలో ఉన్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ-జేడీఎస్ కలిసి.. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మేల్యేలను ఫిరాయించేలా ప్రోత్సహిస్తే.. అప్పుడు రంగం మొత్తం మారిపోతుంది.
ఈ క్రమంలోనే రిసార్టు రాజకీయాలకు తెరదీశారా? అనే చర్చ జరుగుతోంది. అంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే గోవా.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇలాంటి అనుభవాన్ని పొందింది. తన పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ఫిరాయించేలా చేస్తున్నారని ఇటీవల కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా.. కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీంతో రిసార్టు రాజకీయాలైనా చేసిన తన పార్టీ వారిని కాపాడుకునే ప్రయత్నం లో ఉండే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. హైదరాబాద్లో పలు ఫేమస్ హోటళ్లలో రూమ్లు బుక్కయ్యాయి. ప్రముఖ హోటళ్లలో 58 రూములు బుక్ అయినట్టు తెలుస్తోంది. నోవాటెల్ హోటల్లో – 20, పార్క్ హయత్ హోటల్లో – 20,
తాజ్ కృష్ణ హోటల్లో – 18 రూమ్లను కర్ణాటక కు చెందిన కొందరు నేతలు బుక్ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ పరిణామంతో .. కర్ణాటక రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…