నెల్లూరు రాజకీయాల్లో కీలకమైన కుటుంబం మేకపాటి ఫ్యామిలీ. ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న మేకపాటి రాజమోహన్రెడ్డి ఆయన సోదరుడు చంద్రశేఖర్రెడ్డిలు.. తర్వాత వైసీపీకి చేరువయ్యారు. అయితే.. వైసీపీలో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారని భావించిన వైసీపీ.. చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖరరెడ్డి.. దీంతో తీవ్రంగా హర్ట్ అయ్యారు.
ఇదిలావుంటే.. తాజాగా ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ కావడం సంచలనంగా మారింది. భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మేకపాటి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని అంటున్నారు. నిజానికి రాజకీయ శతృవులుగా ఉన్న బొల్లినేని, మేకపాటి తాజాగా ఒకే వేదికపై కలుసుకోవడం.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నా.. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా నేతలు కూడా మారుతున్నారనే చర్చ సాగుతుండడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితం కూడా దుత్తలూరులో చిరకాల రాజకీయ శత్రువు అయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగించారు. మేకపాటి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే చర్చలు అప్పట్లోనూ సాగాయి. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని మేకపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.
ఇప్పుడు మరోసారి బొల్లినేని రామారావుతో మేకపాటి భేటీ కావడం ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు అనే సూత్రం ఎలానూ ఉంది. పైగా వైసీపీ కూడా సస్పెండ్ చేసిన దరిమిలా.. మేకపాటి టీడీపీలోకి వచ్చినా.. రావొచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…