Political News

అవకాశాన్ని వాడుకుంటున్న ఆమంచి

శత్రువు బలహీనపడినప్పుడే బలంగా కొట్టాలంటారు. అన్ని వైపుల నుంచి కమ్ముకోవాలంటారు. అప్పుడే పాత కక్షలన్నీ తీర్చుకోవాలంటారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పర్చూరు ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు అదే పని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. జగన్ మీద అలిగి పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని అన్ని వైపుల నుంచి దెబ్బ తీసేందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడు చేయని ప్రయత్నంలేదు. వీలైతే కుమ్మెయ్యాలన్నంత కోపంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. దానితో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పర్చూరు రాజకీయం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

గత ఎన్నికల్లో చీరాల స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమంచి చీరాలలో పెత్తనం చలాయించారు. ఆమంచి దూకుడును అడ్డుకోవడంలో శ్రీనివాసరెడ్డి చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన పెత్తనమే సాగాలని బాలినేని భావించడంతో చాలా కాలం ఆమంచిని అణిచివేసి ఉంచారు.

ఏడాది తిరిగే సరికి టీడీపీ నుంచి గెలుపొందిన కరణం బలరామ్ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికి టీడీపీకి దూరమయ్యారు. దీంతో ఆమంచి చేతుల్లో ఉన్న చీరాల పెత్తనం కరణం బలరామ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కరణం బలరామ్‌ని వెనుక నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నడిపిస్తున్నారని ఆమంచి కొంత కాలంగా అనుమానిస్తూ ఉన్నారు. కరణం కారణంగా కొంత కాలంగా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్‌ సైలెంట్ అయిపోయారు. పలు హైడ్రామాల మధ్య ఐదు నెలల క్రితం ఆమంచి కృష్ణమోహన్‌కి పర్చూరు నియోజక వర్గ బాధ్యతలు అప్పగించారు. దానితో బాలినేని వర్గాన్ని ఓ ఆట ఆడుకునేందుకు ఆమంచికి అవకాశం వచ్చింది.

బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించే వైవీ సుబ్బారెడ్డి వర్గంలో చేరిన ఆమంచి ఇప్పుడు విజృంభిస్తున్నారు. పర్చూరు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజక వర్గంలోని బాలినేని అనుచరులైన నాయకులపై ఫోకస్‌ పెట్టినట్లు పార్టీలోని వర్గాలే చెబుతున్నాయి. వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. బాలినేనితో సన్నిహితంగా ఉండే వారి జాబితాను రూపొందించి వారికి పనులు కాకుండా అడ్డుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మండల, గ్రామ స్థాయిల్లో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటే…వచ్చే బిల్లులను కూడా విడుదల కానీయకుండా ఆమంచి కృష్ణమోహన్‌ అడ్డుపడుతున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

నియోజక వర్గంలో ఆమంచి గ్రావెల్, ఇసుక, మైనింగ్ మాఫియాలు నడుపుతున్నాడని.. పార్టీలో తనకు అడ్డు వస్తారనుకున్న వారందరినీ వేధిస్తున్నాడని బాలినేని వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని నేరుగా ఎదుర్కొనలేక ఆయన అనుచరులపై ఆమంచి కృష్ణమోహన్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలినేని వర్గం ఇప్పుడు ఆమంచిపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. మరి తాడేపల్లి ప్యాలెజ్ ఇలాంటి కార్యక్రమాలపై నిఘా పెట్టిందో లేదో…

This post was last modified on May 21, 2023 8:25 am

Share
Show comments
Published by
Satya
Tags: Aamanchi

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

8 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

11 hours ago