పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినపుడు కాదు.. అన్న భర్తృహరి సూక్తిని నిజం చేస్తూ.. తెలంగాణ మంత్రి హరీష్రావు కుమారుడు తన్నీరు అర్చిష్మన్.. ప్రతిష్టాత్మక అమెరికా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్లో పట్టా అందుకున్నారు. దీంతో మంత్రి హరీష్ రావు పుత్రుడి విజయాన్ని స్వయంగా వీక్షించి ఆనంద డోలికల్లో ఊగితేలుతున్నారు.
నా కుమారుడు సాధించిన విజయానికి నేను సంతోషిస్తున్నాను అని హరీష్ రావు తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అర్చిష్మన్ విజయానికి తాను గర్వపడకుండా ఉండేలనని తెలిపారు. తన కుమారుడి పట్టుదలను చూసి సంతోషిస్తున్నానని తెలిపారు.
హరీష్ రావు కుమారుడు తన్నీరు అర్చిష్మన్.. అమెరికాలోని బౌల్డర్లో ఉన్న ప్రతిష్టాత్మక కొలరాడో విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చూపిన ప్రతిభకు.. గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డును కైవసం చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు.. మంత్రి హరీష్ రావు అగ్రరాజ్యానికి వెళ్లారు. కార్యక్రమ వేదికపై కుమారుడు అవార్డు అందుకుంటుండగా ప్రత్యక్షంగా వీక్షించి.. తన్మయత్వానికి లోనయ్యారు. అర్చిష్మాన్ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని హరీష్రావు పేర్కొన్నారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగర్ డెస్టినేషన్గా మారుతోందని చెబుతున్న తెలంగాణ మంత్రులు తమ పిల్లలను అమెరికాలో చదివించడం ఏంటని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు సుతిమెత్తగా విమర్శలు కూడా సంధిస్తుండడం గమనార్హం.
This post was last modified on May 13, 2023 11:04 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…