Political News

హైదరాబాద్ ఆసుపత్రిలో అనారోగ్యంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

జర్నలిస్టుగా సుపరిచితుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత విధేయుుడు.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త నియోజకవర్గ ప్రజల్లోనే కాదు.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి షాకింగ్ గా మారింది.

దుబ్బాక నియోజకవర్గంలో గడిచిన నాలుగు దఫాలుగా గెలుస్తూ వస్తున్న రామలింగారెడ్డి మరణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జీర్ణించుకోలేనిదిగా మారుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే హఠాన్మరణం.. పలువురికి షాకింగ్ గా మారింది. రామలింగారెడ్డి సొంతూరు దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత.. కుమారుడు.. కుమార్తె ఉన్నారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోకి రాక మునుపు.. రామలింగారెడ్డి వివిధ వార్తా పత్రికల్లో పని చేశారు. జర్నలిస్టు నాయకుడిగా ఆయన పలు రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సల్ ఉద్యమంలోనూ పాల్గొని.. పోలీసుల నిర్బందాన్ని ఎదుర్కొన్నారు.

పాత్రికేయుల వర్గానికి సంబంధించి బలమైన నేతగా చెప్పుకునే సోలిపేట.. ఊహించని విధంగా మరణించటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతో హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో కన్నుమూసిన వైనం గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో ఆయన మరణ సమాచారం బయటకు వచ్చింది.

This post was last modified on August 6, 2020 10:55 am

Share
Show comments
Published by
Satya
Tags: TRS MLA

Recent Posts

లైలాకు ‘A’ సర్టిఫికెట్….ఇది పెద్ద పరీక్షే

సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…

31 minutes ago

అక్కినేని విజయాలకు ముహూర్తం కుదిరింది

నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…

44 minutes ago

ఒక్క మాటతో 400 సినిమాల్లో అవకాశాలు

ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…

3 hours ago

నిత్య ఆరోగ్యానికి సంజీవని… సోంపు

సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…

7 hours ago

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…

7 hours ago

ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…

9 hours ago