Political News

కోట్లాది మాటల్ని ఈ ఫోటో ఒక్కటి చెబుతుంది?

పై ఫోటోను చూశారుగా. వందలాది మంది ఫ్రేములో ఉన్నా.. అందరి చూపు మాత్రం ఫోటో మొదట్లో పెద్దగా.. స్పష్టంగా కనిపించే ఆ వ్యక్తి వద్ద నిలిచిపోతాయి. నెత్తిన ఎర్రటి టవల్.. కళ్లకు నల్లటి కళ్లజోడు.. నల్లటి గడ్డంతో సీరియస్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్నవ్యక్తి.. 29 ఏళ్ల తర్వాత.. తానే ముఖ్యఅతిధిగా రామజన్మభూమి అయిన అయోధ్యలో నిర్మించే రామాలయానికి భూమిపూజ చేస్తానని ఆ ఫోటోలోని నరేంద్ర మోడీ కూడా కలలో కూడా అనుకొని ఉండరేమో?

ఇంతకీ ఈ ఫోటో ఎప్పటిది? ఏ సందర్భంలో తీశారన్న విషయంలోకి వెళితే.. 1991లో ఢిల్లీలోన బోట్ క్లబ్ లో జరిగిన వీహెచ్ పీ ర్యాలీలో పాల్గొన్న సందర్భంలో తీసినది. రామజన్మభూమి అంశం దేశాన్ని కుదిపేసే వేళలో.. రామాలయ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు.. ఆందోళనలు.. రథయాత్రలు జరిగాయి. ఆ సందర్భంగా కోట్లాది మంది ప్రజలు భాగస్వామ్యం అయ్యారు. అందులో ఒకరు మోడీ.

అప్పట్లో ఆయన సంఘ్ కార్యకర్త మాత్రమే. కానీ.. తాను నమ్మిన సిద్దాంతం కోసం కమిట్ మెంట్ తో నిలిచిన ఆయన.. ఏళ్లకు ఏళ్లు పడిన కష్టానికి ఫలితంగా ప్రధానమంత్రి కావటమే కాదు.. తాను నడిచిన దారిని మరచిపోకుండా.. రామాలయ నిర్మాణాన్ని తన చేతుల్లోనే ప్రారంభించే అరుదైన అవకాశం మోడీకి మాత్రమే దక్కిందని చెప్పాలి. కష్టపడితే.. సామాన్యుడు సైతం అసమాన్యుడు కావటం ఖాయం. కాకుంటే.. అసమాన్యుడు కావటం కోసం పడే కష్టం ఎలాంటి ఫలితం ఇవ్వదన్న సత్యాన్ని మర్చిపోకూడదు.

This post was last modified on August 6, 2020 2:06 pm

Share

Recent Posts

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

22 minutes ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

3 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

10 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

11 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

12 hours ago