Political News

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. హైకోర్టు తాజా ఉత్త‌ర్వులు ఇవే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇక్క‌డ రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతా ల వారికి స్థ‌లాల‌ను కేటాయిస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆర్ – 5 జోన్‌గా పేర్కొనే ప్రాంతంలో సుమారు 1148 ఎక‌రాల స్థ‌లాన్ని పేద‌ల‌కు జ‌గ‌న‌న్న ఇళ్లు ప‌థ‌కం కింద పంపిణీ చేయా లని నిర్ణ‌యించింది. అయితే.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చామ‌ని పేర్కొన్న రైతులు.. దీనిని ఒప్పుకోవ డం లేదు.

ఈ క్ర‌మంలోనే సుదీర్ఘ న్యాయ‌పోరాటం కూడా చేశారు. ఇటు ప్ర‌భుత్వం.. అటు రైతులు కూడా తీవ్ర వాదోప వాదాలు వినిపించారు. ఒక ద‌శ‌లో ఆర్‌-5 జోన్‌లో పేద‌ల‌కు ఇళ్లు ఇచ్చే విష‌యంపై సుప్రీంకోర్టు వ‌ర‌కు కూడా రైతులు వెళ్లారు. అయితే.. మ‌ళ్లీ ఈపిటిష‌న్ల‌ను హైకోర్టులోనే విచారించాల‌న్న సుప్రీం ఆదేశాల‌తో తిరిగి ఇక్క‌డే విచార‌ణ చేప‌ట్టారు. మొత్తంగా ప‌రిశీలిస్తే.. తాజాగా హైకోర్టు దీనికి సంబంధించి సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది.

‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు త్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.

అమరావతి ప్రాంతంలోని ఆర్‌-5 జోన్‌లో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన రైతుల‌ పిటిషన్‌ల‌ను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని.. పిటిషన్‌ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదని సీజే అన్నారు

This post was last modified on May 6, 2023 12:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago