ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతా ల వారికి స్థలాలను కేటాయిస్తూ.. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్ – 5 జోన్గా పేర్కొనే ప్రాంతంలో సుమారు 1148 ఎకరాల స్థలాన్ని పేదలకు జగనన్న ఇళ్లు పథకం కింద పంపిణీ చేయా లని నిర్ణయించింది. అయితే.. రాజధాని కోసం భూములు ఇచ్చామని పేర్కొన్న రైతులు.. దీనిని ఒప్పుకోవ డం లేదు.
ఈ క్రమంలోనే సుదీర్ఘ న్యాయపోరాటం కూడా చేశారు. ఇటు ప్రభుత్వం.. అటు రైతులు కూడా తీవ్ర వాదోప వాదాలు వినిపించారు. ఒక దశలో ఆర్-5 జోన్లో పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంపై సుప్రీంకోర్టు వరకు కూడా రైతులు వెళ్లారు. అయితే.. మళ్లీ ఈపిటిషన్లను హైకోర్టులోనే విచారించాలన్న సుప్రీం ఆదేశాలతో తిరిగి ఇక్కడే విచారణ చేపట్టారు. మొత్తంగా పరిశీలిస్తే.. తాజాగా హైకోర్టు దీనికి సంబంధించి సంచలన ఆదేశాలు జారీ చేసింది.
‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు త్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్లో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన రైతుల పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని.. పిటిషన్ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికి పరిమితం కాదని సీజే అన్నారు
This post was last modified on May 6, 2023 12:06 pm
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…