కేరళలోని యువతులను అపహరించి.. వారిని ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రస్థావరాలకు విక్రయిస్తున్నారనే కథాంశంతో రూపొందించిన ది కేరళ స్టోరీపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దీనిని మేదావులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కూడా కోరుతున్నాయి. అయితే.. ఇంత ఆందోళనలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు పోతోంది. అంతేకాదు.. తాజాగా ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ ది కేరళ స్టోరీ సినిమా ప్రస్తావన తెచ్చారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే కేరళ స్టోరీ అనే సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే యత్నం చేస్తోందని బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగసభలో ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి కవచంలా మారిందన్నారు. ఇలాంటి పార్టీ కర్ణాటకను ఎలా కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాద శక్తులకు తెరవెనుక సహాయపడాలనుకునే కాంగ్రెస్తో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.
బీజేపీ మొదట్నుంచి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే కాంగ్రెస్కు కడుపులో నొప్పి పుడుతుందని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తోందని మోడీ మండిపడ్డారు. డబ్బుతో తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. ది కేరళ స్టోరీ కాంగ్రెస్కు కడుపునొప్పి పుట్టిస్తోందని అన్నారు.
కేరళలో సుమారు 20 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో ది కేరళ స్టోరీని రూపొందించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని నిర్మాత విపుల్ అమృత్లాల్ షా వెల్లడించారు. అయితే.. ఇదంతా కల్పితమేనని అధికార పార్టీ వాదన. మొత్తానికి అనేక వివాదాల నేపథ్యంలోనే ఈ సినిమా థియేటర్లలో కి రానుంది.
This post was last modified on May 6, 2023 12:07 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…