కేరళలోని యువతులను అపహరించి.. వారిని ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రస్థావరాలకు విక్రయిస్తున్నారనే కథాంశంతో రూపొందించిన ది కేరళ స్టోరీపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దీనిని మేదావులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కూడా కోరుతున్నాయి. అయితే.. ఇంత ఆందోళనలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు పోతోంది. అంతేకాదు.. తాజాగా ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ ది కేరళ స్టోరీ సినిమా ప్రస్తావన తెచ్చారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే కేరళ స్టోరీ అనే సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే యత్నం చేస్తోందని బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగసభలో ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి కవచంలా మారిందన్నారు. ఇలాంటి పార్టీ కర్ణాటకను ఎలా కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాద శక్తులకు తెరవెనుక సహాయపడాలనుకునే కాంగ్రెస్తో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.
బీజేపీ మొదట్నుంచి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే కాంగ్రెస్కు కడుపులో నొప్పి పుడుతుందని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తోందని మోడీ మండిపడ్డారు. డబ్బుతో తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. ది కేరళ స్టోరీ కాంగ్రెస్కు కడుపునొప్పి పుట్టిస్తోందని అన్నారు.
కేరళలో సుమారు 20 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో ది కేరళ స్టోరీని రూపొందించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని నిర్మాత విపుల్ అమృత్లాల్ షా వెల్లడించారు. అయితే.. ఇదంతా కల్పితమేనని అధికార పార్టీ వాదన. మొత్తానికి అనేక వివాదాల నేపథ్యంలోనే ఈ సినిమా థియేటర్లలో కి రానుంది.
This post was last modified on May 6, 2023 12:07 pm
అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…
మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రులకు ఆయన ఈ విషయంలో…
ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…
యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…