కేరళలోని యువతులను అపహరించి.. వారిని ఇస్లాం మతంలోకి మార్చి.. ఉగ్రస్థావరాలకు విక్రయిస్తున్నారనే కథాంశంతో రూపొందించిన ది కేరళ స్టోరీపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. దీనిని మేదావులు సైతం వ్యతిరేకిస్తున్నారు. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా.. కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని కూడా కోరుతున్నాయి. అయితే.. ఇంత ఆందోళనలు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు పోతోంది. అంతేకాదు.. తాజాగా ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ ది కేరళ స్టోరీ సినిమా ప్రస్తావన తెచ్చారు. ఉగ్రవాద కుట్ర కోణాన్ని తెలిపే కేరళ స్టోరీ అనే సినిమాను కాంగ్రెస్ అడ్డుకునే యత్నం చేస్తోందని బళ్లారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగసభలో ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి కవచంలా మారిందన్నారు. ఇలాంటి పార్టీ కర్ణాటకను ఎలా కాపాడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాద శక్తులకు తెరవెనుక సహాయపడాలనుకునే కాంగ్రెస్తో కర్ణాటక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.
బీజేపీ మొదట్నుంచి ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుందని మోడీ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంటే కాంగ్రెస్కు కడుపులో నొప్పి పుడుతుందని మోడీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇస్తోందని మోడీ మండిపడ్డారు. డబ్బుతో తప్పుడు కథనాలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. ది కేరళ స్టోరీ కాంగ్రెస్కు కడుపునొప్పి పుట్టిస్తోందని అన్నారు.
కేరళలో సుమారు 20 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి సిరియాలో ఐసిస్ ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించే ఇతివృత్తంతో ది కేరళ స్టోరీని రూపొందించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిజమైన ఘటనల ఆధారంగా సినిమా తీశామని నిర్మాత విపుల్ అమృత్లాల్ షా వెల్లడించారు. అయితే.. ఇదంతా కల్పితమేనని అధికార పార్టీ వాదన. మొత్తానికి అనేక వివాదాల నేపథ్యంలోనే ఈ సినిమా థియేటర్లలో కి రానుంది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…