వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకునే ఖాయమనే విషయం తరచుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరు సీఎం అవుతారు? అనే విషయం కూడా ఆసక్తిగా మారింది. కొన్నాళ్ల కిందట కాపు నాయకులు అందరూ కూడా భేటీ అయి.. సీఎంగా పవన్ను చూడాలని జనసేన అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అయితే.. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇవి దన్నుగా నిలిచాయి.
తాను అధికారంలోకి రావడం ఖాయమని.. తాము అధికారంలోకి వచ్చాక.. తొలి సంతకం.. సుగాలి ప్రీతి వ్యవహారంపై చేస్తానని.. తర్వాత సంతకం.. కౌలు రైతుల ఆత్మ హత్యల నివారణపై ఉంటుందని.. ఇలా నాలుగు సంతకాల గురించి పవన్ తన సభల్లో ప్రస్తావించారు. అయితే.. టీడీపీతో చేరువ అవుతున్న కొద్దీ ఈ దూకుడును పవన్ తగ్గించారు.వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చేస్తామని.. అదేసమయంలో రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
దీనిని బట్టి టీడీపీతోచేరువ అయ్యాక.. పవన్ సీఎం వ్యాఖ్యలు తగ్గుతూ వచ్చాయి. ఇక, ఆదిలో జనసేన కీలక నాయకుడు నాగబాబు కూడా పవన్ సీఎం అంటూ.. కొన్నాళ్లు ప్రచారం చేసినా.. తర్వాతతగ్గారు. కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలోనూ పవన్ సీఎం అవుతారో లేదో.. తెలియదు కానీ.. ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేస్తాం అని నాగబాబు కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే.. సీఎం సీటును చంద్రబాబుకు ఇచ్చి.. రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కించుకునే అవకాశం ఉంటుందని లెక్కలు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి నాగబాబు.. ఈ సీఎం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే రంగంలోకి దిగుతారని.. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. సీఎం పవన్ అయిన తర్వాత.. రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ జవాబు దారీ తనాన్ని తీసుకువస్తామన్నారు. ముఖ్యంగా ధార్మిక సంస్థలు.. హిందూ దేవాలయాలకు సంబంధించి.. సమూల మార్పులు చేస్తామన్నారు. ఈ విషయం ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్, సీఎంగా పవన్ అనే వ్యాఖ్యలు మాత్రం కాక రేపుతున్నాయి. మరిదీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on May 5, 2023 3:46 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…