వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకునే ఖాయమనే విషయం తరచుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరు సీఎం అవుతారు? అనే విషయం కూడా ఆసక్తిగా మారింది. కొన్నాళ్ల కిందట కాపు నాయకులు అందరూ కూడా భేటీ అయి.. సీఎంగా పవన్ను చూడాలని జనసేన అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అయితే.. పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇవి దన్నుగా నిలిచాయి.
తాను అధికారంలోకి రావడం ఖాయమని.. తాము అధికారంలోకి వచ్చాక.. తొలి సంతకం.. సుగాలి ప్రీతి వ్యవహారంపై చేస్తానని.. తర్వాత సంతకం.. కౌలు రైతుల ఆత్మ హత్యల నివారణపై ఉంటుందని.. ఇలా నాలుగు సంతకాల గురించి పవన్ తన సభల్లో ప్రస్తావించారు. అయితే.. టీడీపీతో చేరువ అవుతున్న కొద్దీ ఈ దూకుడును పవన్ తగ్గించారు.వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చేస్తామని.. అదేసమయంలో రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
దీనిని బట్టి టీడీపీతోచేరువ అయ్యాక.. పవన్ సీఎం వ్యాఖ్యలు తగ్గుతూ వచ్చాయి. ఇక, ఆదిలో జనసేన కీలక నాయకుడు నాగబాబు కూడా పవన్ సీఎం అంటూ.. కొన్నాళ్లు ప్రచారం చేసినా.. తర్వాతతగ్గారు. కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలోనూ పవన్ సీఎం అవుతారో లేదో.. తెలియదు కానీ.. ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేస్తాం అని నాగబాబు కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే.. సీఎం సీటును చంద్రబాబుకు ఇచ్చి.. రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కించుకునే అవకాశం ఉంటుందని లెక్కలు వచ్చాయి.
అయితే.. ఇప్పుడు తాజాగా మరోసారి నాగబాబు.. ఈ సీఎం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే రంగంలోకి దిగుతారని.. వచ్చేది జనసేన ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. సీఎం పవన్ అయిన తర్వాత.. రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ జవాబు దారీ తనాన్ని తీసుకువస్తామన్నారు. ముఖ్యంగా ధార్మిక సంస్థలు.. హిందూ దేవాలయాలకు సంబంధించి.. సమూల మార్పులు చేస్తామన్నారు. ఈ విషయం ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్, సీఎంగా పవన్ అనే వ్యాఖ్యలు మాత్రం కాక రేపుతున్నాయి. మరిదీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
This post was last modified on May 5, 2023 3:46 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…