Political News

బీజేపీ ఓటుబ్యాంకుపై కాంగ్రెస్ కన్ను

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓటుబ్యాంకుపై గట్టిగానే కన్నేసింది. బీజేపీకి ముంబై కర్నాటక ప్రాంతం చాలా కీలకం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో బీజేపీకి మంచి పట్టుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లింగాయతుల ఓటు బ్యాంకే. పై 50 నియోజకవర్గాల్లో లింగాయతులే గెలుపోటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. లింగాయతులు ఎవరికి ఓట్లేస్తే ఆ పార్టీయే గెలుస్తుందనటంలో సందేహంలేదు.

మొదట్లో లింగాయతులు కాంగ్రెస్ కే మద్దతుగా ఉండేవారు. ఎప్పుడైతే లింగాయతుల్లో కీలకమైన వీరేంద్రపాటిల్ ను అప్పటి రాజీవ్ గాంధి ముఖ్యమంత్రిగా తొలగించారో అప్పటినుండే లింగాయతులు కాంగ్రెస్ కు దూరమయ్యారు. పక్షవాతంతో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పాటిల్ ను రాజీవ్ తొలగించటమే లింగాయతుల కోపానికి కారణమైంది. దాన్ని యడ్యూరప్ప అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలా దశాబ్దాల పాటు యడ్యూరప్పతోనే లింగాయతులు నడిచారు.

విచిత్రం ఏమిటంటే బీజేపీ నుండి యడ్యూరప్ప బహిష్కరణకు గురయ్యారు. తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని పోటీచేశారు. అప్పట్లో యడ్యూరప్పకు పడిన ఓట్లన్నీ లింగాయతులవే. యడ్యూరప్ప సొంతంగా పార్టీ పెట్టుకున్న కారణంగా లింగాయతుల ఓట్లు బీజేపీకి కాకుండా యడ్యూరప్ప పార్టీకి పడ్డాయి. దాంతో లింగాయతుల దెబ్బ బీజేపీ మీద పడింది. ఆ విషయాన్ని గ్రహించిన బీజేపీ తర్వాత యడ్యూరప్పను మళ్ళీ బీజేపీలోకి తీసుకున్నది. లింగాయతుల్లో అంతటి పట్టున్న యడ్యూరప్ప ఇపుడు ఎన్నికల నుండి తప్పుకున్నారు.

దాంతో రాబోయే ఎన్నికల్లో లింగాయతులు ఏమి చేయబోతున్నారనేది కీలకమైంది. ఎందుకంటే నరేంద్ర మోడీ, రాహుల్ గాంధి ముంబై కర్నాటకపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. యడ్యూరప్పను బీజేపీ అవమానించి ఎన్నికల నుండి తప్పించిందని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టలేకపోతోంది. లింగాయతులకే చెందిన జగదీష్ షెట్టర్, లక్ష్మణసవది లాంటి బలమైన లింగాయత్ నేతలు బీజేపీపై తిరుగుబాటు లేవదీసి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి డెవలప్మెంట్లతో బీజేపీ బలహీనపడిందనే అంటున్నారు. రెండు పార్టీల్లోను లింగాయత్ సామాజికవర్గాలకు చెందిన నేతలున్నారు. దాంతో పోలింగ్ రోజున లింగాయతులు ఏ విధంగా స్పందిస్తారనేది ఎవరికీ అర్ధంకావటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

24 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

53 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago