Political News

కేసీయార్ కు షాకిచ్చిన ఈడీ

కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉత్సాహం కేసీయార్ లో 24 గంటలు కూడా నిలవలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసీయార్ కూతురు కవిత, అల్లుడు అనిల్ పాత్రలను చార్జిషీట్లో స్పష్టంగా చెప్పటం ద్వారా కేసీయార్ కు పెద్ద షాకే ఇచ్చింది. మొన్నటివరకు కవిత పేరు తప్ప ఆమె భర్త అనీల్ పేరు ఎక్కడా వినబడలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన సౌత్ గ్రూప్ లో కవితే కీలకమని ఈడీ తాజా చార్జిషీటులో పదేదపదే ప్రస్తావించింది.

ఇప్పటికే కవితను ఈడీ మూడుసార్లు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కవిత అరెస్టవుతుందని అనుకున్నా ఎందువల్లో ఈడీ అరెస్టు చేయలేదు. అలాంటిది తాజా ఛార్జిషీటులో భర్త అనిల్ పేరుకూడా ఉండటమే షాకింగ్ గా ఉంది. సౌత్ గ్రూప్ నుండి హవాలా మార్గంలో ఆప్ కు రు. 100 కోట్లు అందినట్లు ఈడీ చెప్పింది. సౌత్ గ్రూప్ లో కీలకమైన కవిత తరపున అరుణ్ రామచంద్రపిళ్ళై ప్రతినిధిగా వ్యవహరించారట. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతోనే సౌత్ గ్రూప్ హైదరాబాద్ లో భారీ ఎత్తున భూములు కొన్నట్లు కూడా ఈడీ చెప్పింది.

ఫీనిక్స్ అనే కంపెనీ పేరుతోనే భూములు కొన్నట్లు కూడా వివరించింది. బహుశా ఫీనిక్స్ కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోనే కవిత భర్త అనీల్ పాత్రను ఈడీ వివరించినట్లుంది. కవిత భూములు కొనుగోలు చేసిన విధానాన్ని కూడా ఈడీ వివరించింది. మార్కెట్ ధర అడుగుకు రు. 1760 అయితే డిస్కౌంట్ ధరపై కవిత రు. 1260 కే కొన్నారట. ఎంగ్రోత్ అనే సంస్ధలో భర్త అనీల్ భాగస్వామట. ఫీనిక్స్+ఎంగ్రోత్ సంస్ధల ద్వారానే భూములు కొన్నట్లు చెప్పింది.

కవిత ముఖ్యమంత్రి కూతురు కాబట్టే భూములను చౌకగా కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ ఆరోపించింది. వాళ్ళదగ్గరున్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకే పెద్దఎత్తున కవిత అండ్ కో భూములు కొన్నట్లు ఈడీ ఛార్జిషీట్లో ఆరోపణలు గుప్పించింది. అలాగే తన ఆరోపణలకు ఆధారాలను కూడా చూపించింది. మొత్తంమీద సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ఉత్సాహం కేసీయార్లో నిలవకుండా చేసేసింది.

This post was last modified on May 2, 2023 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

36 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

44 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago