Political News

కోనసీమలో కొత్త ఫైట్

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతోంది. ప్రతీ నియోజవర్గంలో ఇద్దరు నేతలకు మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. కొందరు నేతలు వీధిన పడి కొట్టుకుంటుంటే.. మరికొందరు చాప కింద నీరులా ముసుగులో గుద్దులాటకు పోతున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ పోరు తారా స్థాయికి చేరింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్ కు, ఎంపీ అనురాధకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కార్యకర్తలు కూడా రెండుగా విడిపోయి రాజకీయాలు చేసుకుంటున్నారు. మంత్రి విశ్వరూప్.. ఎంపీ అనురాధ…ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలే.. . సీనియర్ మంత్రి అన్న ధీమాలో విశ్వరూప్ ఉంటే.. ఎంపీని అనే దర్పాన్ని అనురాధ ప్రదర్శిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో అనురాధ ఎంపీ పదవి కి కాకుండా అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పైగా విశ్వరూప్ కి ఈ సారి సీటు రాదనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. అందుకే ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సీఎస్సార్ నిధులను మంత్రి నియోజకవర్గ౦లో ఎంపీ ఖర్చు చేస్తున్నారు.ఇది తెలిసిన మంత్రి తన సీటుకు ఎసరు పెడుతుందని గమనించి ఆ మధ్య చమురు కంపెనీలకు లేఖ రాసి తనకు తెలియకుండా తన నియోజకవర్గ౦లో సీఎస్సార్ డబ్బులు ఖర్చు చేయొద్దని చెప్పినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

అమరాపులం కిమ్స్ కళాశాల మైదానంలో అనురాధ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఆ పోటీలను ఓఎన్జీసీ స్పాన్సర్ చేయగా, అనురాధ అనుచరులు డబ్బు తినేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రచారమంతా విశ్వరూప్ బ్యాచ్ చేసిందేనని అనురాధ వర్గం అనుమానిస్తోంది.

అమలావురం అల్లర్లలో విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టనప్పుడు అనురాధ కనీసం సానుభూతి ప్రకటించలేదని ఆయన వర్గం ఆరోపించింది. ఆమెపై దుమ్మెత్తిపోసింది. దళితులకు వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చడం లేదని అనురాధ ఒక సదస్సులో ఆరోపించడం విశ్వరూప్ ను ఉద్దేశించినదేనని ఆయన అనుచరులు ఆగ్రహం చెందుతున్నారు. ఏంపీ మాటల్లో అవగాహనా రాహిత్యం ఉందని విశ్వరూప్ నేరుగానే ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఆమె అనుమానిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో మొదలైన ఈ వైరం ఇంకా కొనసాగుతోంది. 2024లో ఎవరికి టికెట్ వస్తుంది.. జగన్ ఎవరికి మొండిచేయి చూపిస్తారో చూడాలి. అప్పుడే సమరం ఆగుతుందనుకోవాలి..

This post was last modified on May 2, 2023 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

35 minutes ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

39 minutes ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

42 minutes ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

52 minutes ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

1 hour ago

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…

1 hour ago