Political News

కోనసీమలో కొత్త ఫైట్

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతోంది. ప్రతీ నియోజవర్గంలో ఇద్దరు నేతలకు మధ్య విభేదాలు, వివాదాలు నిత్యకృత్యమయ్యాయి. కొందరు నేతలు వీధిన పడి కొట్టుకుంటుంటే.. మరికొందరు చాప కింద నీరులా ముసుగులో గుద్దులాటకు పోతున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ పోరు తారా స్థాయికి చేరింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్ కు, ఎంపీ అనురాధకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కార్యకర్తలు కూడా రెండుగా విడిపోయి రాజకీయాలు చేసుకుంటున్నారు. మంత్రి విశ్వరూప్.. ఎంపీ అనురాధ…ఇద్దరూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలే.. . సీనియర్ మంత్రి అన్న ధీమాలో విశ్వరూప్ ఉంటే.. ఎంపీని అనే దర్పాన్ని అనురాధ ప్రదర్శిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో అనురాధ ఎంపీ పదవి కి కాకుండా అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పైగా విశ్వరూప్ కి ఈ సారి సీటు రాదనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. అందుకే ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సీఎస్సార్ నిధులను మంత్రి నియోజకవర్గ౦లో ఎంపీ ఖర్చు చేస్తున్నారు.ఇది తెలిసిన మంత్రి తన సీటుకు ఎసరు పెడుతుందని గమనించి ఆ మధ్య చమురు కంపెనీలకు లేఖ రాసి తనకు తెలియకుండా తన నియోజకవర్గ౦లో సీఎస్సార్ డబ్బులు ఖర్చు చేయొద్దని చెప్పినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

అమరాపులం కిమ్స్ కళాశాల మైదానంలో అనురాధ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఆ పోటీలను ఓఎన్జీసీ స్పాన్సర్ చేయగా, అనురాధ అనుచరులు డబ్బు తినేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రచారమంతా విశ్వరూప్ బ్యాచ్ చేసిందేనని అనురాధ వర్గం అనుమానిస్తోంది.

అమలావురం అల్లర్లలో విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టనప్పుడు అనురాధ కనీసం సానుభూతి ప్రకటించలేదని ఆయన వర్గం ఆరోపించింది. ఆమెపై దుమ్మెత్తిపోసింది. దళితులకు వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చడం లేదని అనురాధ ఒక సదస్సులో ఆరోపించడం విశ్వరూప్ ను ఉద్దేశించినదేనని ఆయన అనుచరులు ఆగ్రహం చెందుతున్నారు. ఏంపీ మాటల్లో అవగాహనా రాహిత్యం ఉందని విశ్వరూప్ నేరుగానే ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఆమె అనుమానిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో మొదలైన ఈ వైరం ఇంకా కొనసాగుతోంది. 2024లో ఎవరికి టికెట్ వస్తుంది.. జగన్ ఎవరికి మొండిచేయి చూపిస్తారో చూడాలి. అప్పుడే సమరం ఆగుతుందనుకోవాలి..

This post was last modified on May 2, 2023 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

55 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

6 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago