Political News

రజినీ విషయంలో వైసీపీ బిగ్ బ్లండర్

అవతల ఉన్నది ఎవరని చూడరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను పొగిడినా.. జగన్‌ను విమర్శించినా.. ఎటాక్ ఎటాక్ ఎటాక్. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల తీరు. సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలోనూ ఇలాగే చేశారు. రెండు రోజుల కిందట విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరైన రజినీకాంత్.. రాజకీయాల గురించి మాట్లాడను అని చెబుతూనే.. చంద్రబాబు విజన్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పాడు.

హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్రను కొనియాడుతూ.. పనిలో పనిగా కేసీఆర్‌ గురించీ ప్రస్తావించాడు. అంతకుమించి ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అన్నింటికీ మించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ గురించి కానీ, సీఎం జగన్‌ గురించి కానీ.. ఎలాంటి విమర్శలూ చేయలేదు. కానీ చంద్రబాబును పొగడ్డమే వైసీపీ వాళ్లకు నచ్చలేదు. కానీ కొడాలి నాని, జోగి రమేష్ లాంటి నాయకులతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ టీమ్స్ రెచ్చిపోయాయి. రజినీని దారుణాతి దారుణంగా తిట్టిపోశాయి.

ఐతే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి మర్యాద కోసం మాట్లాడిన నాలుగు మాటల్ని పట్టుకుని ఈ స్థాయిలో దాడి చేయడం దారుణం అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లోనే కాక.. సామాన్య జనాల్లోనూ వ్యక్తం అవుతున్నాయి. అందులోనూ క్లీన్ ఇమేజ్ ఉండి, సాత్వికుడిగా పేరుండి.. తెలుగులోనూ భారీగా అభిమానగణం ఉన్న రజినీపై ఇలా దాడి చేయడం ఎవ్వరికీ రుచించడం లేదు. ఈ విషయంలో వైసీపీకి పెద్ద డ్యామేజే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే వైసీపీ ఎటాక్ తర్వాత రజినీకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. వైసీపీ మీద టీడీపీ, జనసేన వాళ్లే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా విరుచుకుపడ్డారు.

రజినీని తిట్టడంతో తమిళ నెటిజన్లు కూడా రంగంలోకి దిగారు. అందరూ కలిసి వైఎస్సార్సీపీ సూపర్ స్టార్‌కు క్షమాపణ చెప్పాలంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. నిన్నంతా నేషనల్ లెవెల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. వైసీపీని విమర్శిస్తూ మీమ్స్ మోత మోగించేశారు. రజినీ ‘జైలర్’ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆయన జైలర్‌గా ఉన్న జైల్లో జగన్ ఖైదీగా ఉన్నట్లు మీమ్స్ వేసి వైరల్ చేశారు. అంతే కాక ‘‘మా రాజధాని చెన్నై. మరి మీదేంటో చెప్పండి’’ అంటూ వైసీపీ రాజధాని డ్రామా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. రజినీకి పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా అభిమానగణం ఉంటుంది. వ్యక్తిగా ఆయనకు గొప్ప పేరుంది. అలాంటి వ్యక్తిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసి పెద్ద డ్యామేజే చేసుకున్నట్లు కనిపిస్తోంది వైసీపీ.

This post was last modified on May 1, 2023 2:08 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

54 minutes ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

1 hour ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

4 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

5 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

5 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

7 hours ago