Political News

అది కర్ణాటక సీటు అయినా… తెలుగోళ్ల ఓట్లే గెలిపించేది

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఒక ఎమ్మెల్యే కేవ‌లం ఏపీ ప్ర‌జ‌లు వేసే ఓటుపైనే ఆధార‌ప‌డ్డారు. ఏపీకి సరిహద్దుల్లో ఉన్న బాగేపల్లిలో కన్నడ ప్రజలతోపాటు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. రాసేది కన్నడ భాషలో అయినా తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. ఏపీలోని చిలమత్తూరు, గోరంట్ల, కోడికొండ, పెనుగొండ, కదిరి, తాడిపత్రి, ధర్మవరం తదితర ప్రాంతాలనుంచి వలసవచ్చిన తెలుగు ప్రజలు ఇక్కడ వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుంటూ కన్నడిగులతో మమేకమయ్యారు.

బాగేపల్లి పట్ట జనాభా 2011 జనాబా లెక్కల ప్రకారం 25 వేల మంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలకు పైగానే ఉంది. ఇందులో సుమారు 20 శాతానికిపైగా ప్రజలు తెలుగువారే. ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపోటములను తెలుగు ప్రజలు ప్రభావితం చేస్తుంటారు. ప్రస్తుతం విధానసభ ఎన్నికలు ఇక్కడ రసవత్తరంగా మారాయి. ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు మొత్తం 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో బాగేపల్లి, గుడిబండ, చేళూరు తాలూకాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి, సీపీఎం తరఫున డాక్టర్‌ అనిల్‌కుమార్‌ బరిలో ఉన్నారు. జేడీఎస్‌ సీపీఎంకు మద్దతు ఇస్తోంది. బీజేపీ నుంచి మునిరాజ్‌ బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే సుబ్బారెడ్డి హ్యాట్రిక్‌ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున పార్టీ జాతీయ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇండింపెండెంట్‌ అభ్యర్థి మిథున్‌రెడ్డి కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఎవ‌రు గెల‌వాల‌న్నా.. ఏపీ ప్ర‌జ‌ల ఓటు అత్యంత కీల‌కం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 1, 2023 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

2 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago