కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాలే సమయం ఉంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ప్రచారం ముమ్మరం చేశాయి. కీలక నేతలు రంగంలోకి దిగారు. స్టార్ క్యాంపెనర్లుగా ఉన్న సినీ ప్రముఖులు సైతం ప్రచారం చేస్తున్నారు. ఇదిలావుంటే.. మరో 15 రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఎవరు అధికారం దక్కించుకోనున్నారనే విషయంపై తాజాగా ఒక సర్వే బయటకు వచ్చింది.
నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు రోజుల్లోనే.. కర్ణాటక పరిస్థితిపై అనేక సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. ఆయా ఫలితాల్లో కాంగ్రెస్కే ప్రజలు పట్టం కడుతున్నారని స్పష్టం చేశాయి. అలాగే.. పోటీ మాత్రం తాడోపేడో.. అన్నవిధంగా సాగుతుందని కూడా చెప్పాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ.. 100 స్థానాల్లో విజయందక్కించుకుంటుందనే అవకాశం ఉందని కూడా పేర్కొన్నాయి.
అయితే.. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. బీజేపీ హవా సన్నగిల్లుతున్నట్టు మరో తాజాగా సర్వే పేర్కొంది. Tv9 కన్నడ, సీ ఓటర్స్ సంస్థలు… సంయుక్తంగా చేసిన సర్వేలో బీజేపీ దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు స్పష్టమైంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. కాంగ్రెస్ ఏకంగా.. 106-116 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
ఇక, బీజేపీ కేవలం 79 – 89 స్థానాలకే పరిమితం అవుతుందని.. అది కూడా స్వల్ప మెజారిటీతోనే విజయం దక్కించుకుంటుందని తేల్చి చెప్పడం గమనార్హం. మరోవైపు ప్రాంతీయ పార్టీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 24 – 34 స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని పేర్కొంది. ఇతర పార్టీల అభ్యర్థులు ఐదుగురు వరకు గెలుస్తారని చెప్పడం విశేషం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 26, 2023 4:22 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…