Political News

మ‌హానాడు వేదిక మారింది.. రాజ‌మండ్రిలో కాదు.. !

ఏటా మే 28న టీడీపీ ఘ‌నంగా నిర్వ‌హించే మ‌హానాడు వేదిక నిర్ణ‌యం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది మ‌హానాడును రాజ‌మండ్రిలో నిర్వ‌హించాల‌ని పార్టీ నాయ‌కులు భావించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. త‌పిస్తున్న టీడీపీ బ‌ల‌మైన వ‌ర్గం ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రిలో మ‌హానాడును నిర్వ‌హించాల‌ని త‌ల‌పోసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు బుచ్చ‌య్య చౌద‌రి, ఆదిరెడ్డి భ‌వానీ వంటివారు స్థ‌లం కోసం కూడా అన్వేషించారు.

అయితే.. అనూహ్యంగా ఈ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. విజ‌య‌వాడ శివారులోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న తాడిగ‌డ‌ప 100 అడుగుల రోడ్డులో మ‌హానాడుకు వేదిక రెడీ కానుంది. దీనికి సంబంధించి భూమి పూజను మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఎన్టీఆర్‌ శత జయంతి కమిటీ చైర్మన్‌ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ… ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఒక చరిత్ర సృష్టించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ రచించిన “ఎన్టీఆర్‌ చారిత్రక ప్రసంగాలు- అసెంబ్లీ ప్రసంగాలు” పుస్తకం ఆవిష్కరణ ఉంటుందన్నారు. వెబ్‌సైట్, సావనీర్ హైదరాబాద్‌లో త్వరలోనే ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ పాల్గొంటారన్నారు. ఎన్టీఆర్‌ యాప్‌ను నారా లోకేష్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కాగా, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ శత జయంతి ‌వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే వేదిక మీద చూడటం కనుల విందుగా ఉంటుందన్నారు. లక్షలాది మంది అభిమానులు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగం అవుతున్నారని తెలిపారు.

This post was last modified on April 25, 2023 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

51 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago