Political News

జ‌గ‌నే మా భ‌విష్య‌త్తుకు వెన‌కాల‌.. ఇంత పెద్ద షాక్ త‌గిలిందా…!


ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మం.. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌.. జ‌గ‌నే మా భ‌విష్య‌త్తు కార్య‌క్రమం. ఈ కార్య‌క్ర‌మాలు ఈ నెల 7న ప్రారంభ‌మై 20న ముగియాల్సి ఉంది. అయితే..దీనికి వ‌స్తున్న స్పంద‌న‌తో సీఎంజ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాల‌ను ఈ నెల 29 వ‌ర‌కు పొడిగించార‌ని వైసీపీ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదేస‌మయంలో ఈ కార్య‌క్ర‌మాల‌కు భారీ ఎత్తున రెస్పాన్స్ వ‌స్తోంద‌ని.. ఇప్ప‌టికి 70 ల‌క్ష‌ల మంది మిస్డ్ కాల్ ఇచ్చార‌ని తెలిపింది.

అయితే..నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. నిజ‌మే మిస్డ్ కాల్ ఇచ్చారు. 70 ల‌క్ష‌ల మంది నుంచి మిస్డ్ కాల్స్ వ‌చ్చిన మాట కూడా వాస్త‌వమే. ప్ర‌జ‌ల్లో రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇది పైపైనే! నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం మ‌రో ఏడాదిపాటు పాల‌న చేయ‌నుంది. దీంతో ప్ర‌జ‌ల‌కు అందాల్సిన సంక్షేమ ప‌థ‌కాలు మ‌రో ఏడాది పాటు అందాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిలో కీల‌క‌మైన అమ్మ ఒడి, చేయూత వంటి భారీ న‌గ‌దు కార్య‌క్ర‌మాలు ఉన్నాయి.

అదే స‌మయంలో పింఛ‌ను 3000 రూపాయ‌లు పెంచేకార్య‌క్ర‌మం జ‌న‌వ‌రి నుంచి అమ‌లు కానుంది. ఇది.. వ‌చ్చే ప్ర‌భుత్వాలు కూడా కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో ల‌బ్ధి దారులు..త‌మ‌కుఇష్టం ఉన్నా లేకున్నా.. వ‌లంటీర్లు, గృహ‌సార‌థులు వ‌చ్చిన‌ప్పుడు వారు చెప్పిన‌ట్టు వింటున్నారు. మిస్డ్ కాల్ ఇవ్వ‌మంటే ఇస్తున్నారు. ఇంటికి స్టిక్క‌ర్ అంటిస్తామ‌న్నా.. స‌రేనంటున్నారు. కానీ, త‌ర్వాతే అస‌లు విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది.

వ‌లంటీర్లు, గృహ‌సార‌థుల‌కు ర‌హ‌స్యంగా వైసీపీ నుంచి ఆదేశాలు వ‌చ్చాయి. మీరు అంటించిన స్టిక్క‌ర్లు వారం త‌ర్వాత‌.. అలానే ఉన్నాయో లేదో ..ప‌రిశీలించాల‌నేది ఈ ఆదేశం. దీంతో వ‌లంటీర్లు గ‌డిచిన రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా అదే ప‌నిచేశారు. స‌గానికిపైగా ఇళ్ల‌కు స్టిక్క‌ర్లు క‌నిపించ‌లేదు. దీంతో ఇదే విష‌యాన్ని వారు పార్టీ అధిష్టానానికి పంపించారు. అంటే.. ప్ర‌జ‌లు వైసీపీ వైపు ఏవిధంగా ఉన్నార‌నేది ఇప్పుడు స్ప‌ష్టంగా అర్ధ‌మైంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి దీనిని ఎలా చూస్తారో చూడాలి.

Satya

Recent Posts

గీతాంజలి… ఇలాంటివి కదా చూడాలి

గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…

1 hour ago

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…

3 hours ago

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

3 hours ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

4 hours ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

4 hours ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

5 hours ago