Political News

ట్విస్ట్ : జగన్ సర్కారుపై స్వరూపానంద ఆగ్రహం

స్వ‌రూపానంద స్వామి. విశాఖ‌లోని శార‌దాపీఠాధిప‌తి. పైగాసీఎం జ‌గ‌న్‌కు..వైసీపీ నాయ‌కుల‌కు ఎంతో ఆత్మీయ స్వామిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆయ‌న తాజాగా వైసీపీ స‌ర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అప్ప‌న్న‌ను సామాన్య భక్తులకు దూరం చేసేలా దేవ‌దాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.

ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. కొండ కింది నుంచి పైవరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని, భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర అన్నారు.

కాగా, ఏడాదికి ఒక్క‌సారిమాత్ర‌మే ల‌భించే అప్ప‌న్న నిజ రూప ద‌ర్శ‌నం కోసం ఆదివారం రాష్ట్ర‌, రాష్ట్రేత‌ర భ‌క్తులు క్యూ క‌ట్టారు. అయితే.. ఏటా భ‌క్తుల రాగ పెరుగుతున్న నేప‌థ్యంలో ఏర్పాట్లు ఘ‌నంగా చేయాల్సిన అధికారులు కేవ‌లం క్యూ లైన్లు క‌ట్టి మిన్న‌కున్నారు. పైగా టికెట్ ధ‌రల‌ను ఆసాంతం పెంచేశారు. రూ.500 టికెట్ ధ‌ర‌ను ఏకంగా 1500ల‌కు పెంచారు. అదేవిధంగా వీఐపీ ద‌ర్శ‌న ఏర్పాట్లు కూడా స‌రిగా చేయ‌ల‌ని వీఐపీలు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

This post was last modified on April 23, 2023 5:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago