Political News

మంగళగిరిలో పోటీ చేసేదెవరు? అన్నా? తమ్ముడా?

మంగళగిరి వైసీపీలో రాజకీయం మారుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి అక్కడ పోటీ చేయబోవడం లేదన్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన సోదరుడు, ఎంపీ అయోధ్యరామిరెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో తెగ తిరుగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మంగళగిరిలో మకాం వేస్తున్నారు. అదేసమయంలో బీసీలకు ఇక్కడి టికెట్ ఇవ్వాలన్న వాదన ఒకటి వైసీపీలో మొదలైంది.

మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే లక్ష్యంగా ఆయన గత ఇదేళ్లుగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నారు. వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా ఓడిన చోటనే విజయం సాధించాలని ఆయన చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. వైసీపీ మాత్రం ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డిని ఇక్కడి నుంచి లోకేశ్ పై పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు. కానీ, అయోధ్య రామిరెడ్డి మాత్రం రామకృష్ణారెడ్డే పోటీ చేస్తారని చెప్తున్నారు.

మరోవైపు ఇక్కడి నుంచి బీసీలకు టికెట్ ఇస్తారని వైసీపీలోని బీసీ నేతలు ఆశ పెట్టుకున్నారు. ముఖ్యంగా పద్మశాలీలకు మంగళగిరి టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఒకటి అక్కడి నాయకులు అధిష్ఠానం ముందుంచుతున్నారు. దీనికి బలమైన కారణం ఉంది. రాష్ట్రంలో పద్మశాలీ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో మంగళగిరి ఒకటి. ఇక్కడ మొత్తం 2,70,000 మంది ఓటర్లు ఉండగా అందులో బీసీలే ఎక్కువ. అందులోనూ పద్మశాలీ కులస్థులు ఎక్కువ. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీకి విజయం వరిస్తుందనే బలమైన టాక్ ఉంది.

ఓవైపు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళగిరి పై ప్రత్యేక దృష్టి సారించి తరచూ పర్యటిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అవకాశం చిక్కినప్పుడల్లా సేవా కార్యక్రమాల పేరుతో జనంలో తిరుగుతున్నారు. దీంతో వైసీపీ టికెట్ ఎవరికిఇస్తారన్నది చర్చనీయంగా మారింది.

మరోవైపు మంగళగిరి వైసీపీలో నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఈపూరి రమేష్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. తాజాగా శివాలయం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

రానున్న రోజుల్లో కొందరు ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ఓ కీలక నేత పార్టీని వీడనున్నట్లు సమాచారం.ఇందుకు స్థానిక నాయకత్వం పై ఉన్న అసంతృప్తి కారణమని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినప్పటికీ టిడిపి తరఫున మాత్రం లోకేష్ బరిలోకి దిగటం ఖాయమని చెబుతున్నారు. అయితే… వైసీపీ కనుక పద్మశాలీలను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే టీడీపీ కూడా ప్లాన్ మార్చే అవకాశం ఉందన్న వాదన ఒకటి వినిపిస్తోంది

Satya

Recent Posts

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

4 minutes ago

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

2 hours ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

12 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

14 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

16 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

16 hours ago