Political News

టీడీపీ సెల్ఫీల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!

ఏపీలో రాజ‌కీయం అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకుంది. ఒక‌వైపు అధికార పార్టీ వైసీపీ.. ఇంటింటికీ స్టిక్క‌ర్ల పేరుతో ఈ నెల 7 నుంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. ఇది ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ హుకుం జారీ చేశారు. ఇక‌, దీనికి పోటీగా టీడీపీ నాయ‌కులు కూడా యాంటీ స్టిక్క‌ర్ల యుద్ధం ప్రారంభించారు. అయితే.. ఇది వివాదాల‌కు తావిస్తుండ‌డంతో అనూహ్యంగా సెల్ఫీ యుద్ధం ప్రారంభించారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, శ్రేణులు.. సెల్ఫీల‌తో అద‌ర గొడుతున్నారు. ఎక్క‌డికక్క‌డ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రు లు.. నాయ‌కులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. త‌మ హ‌యాంలో చేసిన అభివృద్ది, క‌ట్టిన క‌మ్యూనిటీ హాళ్లు.. వేసిన శిలా ఫ‌లకాల ముందు నిల‌బ‌డి సెల్పీలు తీసుకుంటున్నారు. త‌మ హ‌యాంలో వీటిని ఏర్పాటు చేశామ‌ని.. వైసీపీ ప్ర‌భు్త్వం వీటిని నిలిపేసింద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ కీల‌క‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో రూపొందించిన కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ గండికొట్టిందంటూ.. నాయ‌కులు.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు. మీ హ‌యాంలో ఇలాంటి కార్య‌క్ర‌మం ఒక్క‌టైనా జ‌రిగిందా? ఉంటే.. మీరు కూడా సెల్ఫీ తీసుకోండి-అంటూ టీడీపీ నాయ‌కులు రువ్వుతున్న స‌వాళ్ల‌తో వైసీపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌డం లేదు.

ఇక‌, ఈ సెల్ఫీ ఛాలెంజ్‌కార్య‌క్ర‌మాన్ని డిజిట‌ల్ మాధ్య‌మాల్లోనూ టీడీపీ నాయ‌కులు ప్ర‌మోట్ చేస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో రాజ‌కీయంగా ఈ కార్య‌క్ర‌మానికి మంచి ఊపు వ‌చ్చింది. నెటిజ‌న్లు ఎక్కువ‌గా దీనిని వీక్షిస్తూ.. త‌మ మ‌ద్ద‌తు తెలుపుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని చేసినా.. వైసీపీ అడ్డంగా బుక్క‌యింద‌నే వాద‌న వినిపిస్తోంది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago