కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైన నాటి నుంచి కూడా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అధికార బీజేపీ మరోసారి ఇక్కడ పుంజుకుంటే.. కేంద్రంలో ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకా శం ఉంటుందనే భావన కమలం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఇక్కడ సామదాన భేద దండోపాయా లను పార్టీ వినియోగిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో అనుకూల పరిస్థితిని మరింత పెంచుకుంటోంది.
అయితే.. కీలకమైన నాయకులు.. పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చే పార్టీని శాసిస్తున్న లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఎదిగిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది వంటివారు పార్టీకి దూరమయ్యారు. ఇది బీజేపీకి ఊహించని దెబ్బే. అయితే.. అలాగ ని ఈ పార్టీ పెద్దలు చూస్తూ కూర్చోలేదు. తాము చేయాలని అనుకున్న పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చిన్నా చితకా పార్టీలను రంగంలోకి దింపారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఈ రకంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటిలో కర్ణాటక రాష్ట్రసమితి కీలకంగా వ్యవహరించనుంది. ఈ పార్టీ ఏకంగా 199 స్థానాల్లో పోటీ చేస్తోంది.వాస్తవానికి ఈ పార్టీ ఆప్ నుంచి పుట్టిందే. ఆప్లో నిన్న మొన్నటి వరకు.. యాక్టివ్గా ఉన్న రవికృష్ణారెడ్డి అనే ఎంప్లాయ్ని బయటకు తీసుకువచ్చి.. ఆయనతో కర్ణాటక రాష్ట్రసమితి పార్టీని ఏర్పాటు చేసేలా మాజీ సీఎం యడియూరప్ప చక్రం తిప్పారు.
దీంతో కర్ణాటక రాష్ట్రసమితిని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉన్నారని భావి స్తున్న ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాల ప్రజల ఓట్లను చీల్చగలిగితే.. బీజేపీ ఒకింత బయటపడినట్టేనని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ కూడా.. బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తోందనే వాదనబలంగా వినిపిస్తోంది. ఈ పార్టీ కూడా ప్రభుత్వవ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నంలో ఉంది. మొత్తంగా.. బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏమవుతుందో చూడాలి.
This post was last modified on April 24, 2023 6:10 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…