టీడీపీ అధినేత చంద్రబాబుకు విజన్ ఉన్న నాయకుడు అనే ఇమేజ్ ఉంది. ఇది చెరిపేస్తే చెరిగేలా లేదు. ఆయన అంత బలంగా పునాదులు వేసుకున్నారు. అయితే.. దీనిని ఖరాబు చేయాలని.. చంద్రబా బుకు ఇమేజ్ లేదని చాటి చెప్పాలని ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే తరచుగా అమరావతిని కేంద్రంగా చేసుకుని ఇక్కడ సినిమా చూపించారు తప్ప ఏమీలేదనే విమర్శలు చేస్తూ వచ్చారు.
అయితే.. తాజాగా అమరావతి విషయం జాతీయస్థాయిలోనూ మంచి పేరు తెచ్చుకోవడం.. ఇటీవల హైదరాబాద్ కొన్ని విషయాల్లో(రియల్ ఎస్టేట్.. పెట్టుబడులు.. ఉపాధి కల్పన) ముందుండడంతో అమరావతి పుంజుకుని ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని.. తెలంగాణ మంత్రులే బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు ఇమేజ్ మరింత పెరిగింది. ఇది వైసీపీ ఇచ్చిన అవకాశమేనని అంటున్నారు పరిశీలకులు.
అసలు అమరావతిని తనదైన పద్ధతిలో మరింత మెరుగులు దిద్ది.. జగన్ అభివృద్ధి చేసి ఉంటే.. నిజంగానే చంద్రబాబు ఇమేజ్ ఏమై ఉండేదో!? ఇక, చంద్రబాబు ఎక్కడ పర్యటించినా .. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కాన్వాయ్పై రాళ్లు రువ్వడం.. కేసులు పెట్టడం.. పార్టీ కార్యకర్తలను వేధించడం పరిపాటిగా మారింది. ఇది కూడా చంద్రబాబుకు సానుభూతి పవనాలు వచ్చేలా చేసింది.
మరోవైపు.. చంద్రబాబు హయాంలో ఉన్న రంజాన్ తోఫాను రద్దు చేయడం.. అన్నా క్యాంటీన్లను తీసేయడం కూడా.. వైసీపీకి మైనస్ కాగా..(ఎన్ని పథకాలు అమలు చేసినా.. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్గా మారాయి) టీడీపీకి ప్లస్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు చేస్తున్న ప్రతయ్నాలతో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ మరింత పెరిగిందని అంటున్నారు. దీనికి తోడు చంద్రబాబు వృద్ధుడు అని చేస్తున్న ప్రచారాన్ని మెజారిటీ ప్రజలు తిరస్కరిస్తుండడం గమనార్హం.
This post was last modified on April 23, 2023 11:11 am
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…