Political News

జగన్.. భారతిరెడ్డిలను విచారించాలట

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన పరిణామాల గురించి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభి సంచలన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని.. ఆయన సతీమణి భారతి రెడ్డిలను సీబీఐ విచారించాలన్న కొత్త డిమాండ్ ను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.

వివేకా హత్యలో ఇప్పటివరకు విచారించిన వారంతా పాత్రధారులేనని.. అసలు సూత్రధారులు మాత్రం జగన్ దంపతులేనని వ్యాఖ్యానించారు. వారిద్దరికి సీబీఐ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాల్సిందేనని కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ దంపతుల మీద.. వారి పాత్ర మీదా తొలి నుంచి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్న ఆయన.. అందులో కీలకమైన ప్రశ్నలకు సమాధానాన్ని రాబడితే సీబీఐ విచారణ ముగిసినట్లేనని చెప్పుకొచ్చారు పట్టాభి.

తాను చేసే తీవ్రమైన ఆరోపణలకు కాసిన్ని ఆధారాలు కూడా చూపించాల్సింది. అదేమీ లేకుండా ఇలా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసే ముందు.. అలా ఎందుకు చేయాలన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. దానికి సంబంధించిన ఆధారాల్ని కూడా ప్రస్తావిస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా నాలుగు నోటి మాటల్ని చెప్పటంతో సరిపోదన్న విషయాన్ని పట్టాభి లాంటి నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

This post was last modified on April 23, 2023 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

3 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

5 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

6 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

8 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

9 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

9 hours ago