Political News

అమ‌రావ‌తి పై ప‌వ‌న్ స‌వాల్.. టీడీపీ, వైసీపీ రెడీనా?‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్టుబ‌ట్టి అమ‌రావ‌తి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని త‌ర‌లిస్తూ.. మూడు రాజధానుల ప్ర‌తిపాద‌న‌కు ఆమోద ముద్ర వేసుకోవ‌డంపై జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మెత‌క‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. దీన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌ట్లేద‌ని కొన్ని వ‌ర్గాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ముందు ఆచితూచి మాట్లాడిన ప‌వ‌న్.. తాజాగా కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డాన్ని నిర‌సిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశాడు.

అలాగే వైసీపీ ఎమ్మెల్యేల‌కూ ప‌వ‌న్ రాజీనామా సవాలు విసిరాడు. త‌మ ప్రాంతం నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తున్నందుకు వైకాపాకు చెందిన కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలన్నాడు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే వీళ్లంద‌రూ రాజీనామాల త‌ర్వాత‌ ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని ప‌వ‌న్ డిమాండ్ చేశాడు.

రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారన్న ప‌వ‌న్‌.. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నామన్నాడు. జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌భుత్వ‌ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించాడు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని ప‌వ‌న్ చెప్పాడు. మరి సహేతుకంగానే అనిపిస్తున్న పవన్ ‘రాజీనామా’ ఛాలెంజ్ పట్ల టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on August 3, 2020 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డెకాయిట్ ఛాన్సుకి అదొక్కటే అడ్డంకి

ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…

10 minutes ago

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…

1 hour ago

గబ్బర్ గర్వం… ఉస్తాద్ వల్ల మాయం

ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…

2 hours ago

సంతోష్ శోభ‌న్… ప‌ర‌లోక యాత్ర‌

ఫ్లాపుల ప‌రంప‌ర‌కు తెర‌దించుతూ.. ఈ ఏడాది క‌పుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సంతోష్ శోభ‌న్.…

4 hours ago

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత…

6 hours ago

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న…

9 hours ago