Political News

అమ‌రావ‌తి పై ప‌వ‌న్ స‌వాల్.. టీడీపీ, వైసీపీ రెడీనా?‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్టుబ‌ట్టి అమ‌రావ‌తి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిని త‌ర‌లిస్తూ.. మూడు రాజధానుల ప్ర‌తిపాద‌న‌కు ఆమోద ముద్ర వేసుకోవ‌డంపై జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మెత‌క‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. దీన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకించ‌ట్లేద‌ని కొన్ని వ‌ర్గాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ముందు ఆచితూచి మాట్లాడిన ప‌వ‌న్.. తాజాగా కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. మూడు రాజధానులపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డాన్ని నిర‌సిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశాడు.

అలాగే వైసీపీ ఎమ్మెల్యేల‌కూ ప‌వ‌న్ రాజీనామా సవాలు విసిరాడు. త‌మ ప్రాంతం నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తున్నందుకు వైకాపాకు చెందిన కృష్ణా, గుంటూరు వైకాపా ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలన్నాడు. అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే వీళ్లంద‌రూ రాజీనామాల త‌ర్వాత‌ ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని ప‌వ‌న్ డిమాండ్ చేశాడు.

రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారన్న ప‌వ‌న్‌.. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నామన్నాడు. జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌భుత్వ‌ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించాడు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని ప‌వ‌న్ చెప్పాడు. మరి సహేతుకంగానే అనిపిస్తున్న పవన్ ‘రాజీనామా’ ఛాలెంజ్ పట్ల టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on August 3, 2020 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago