Political News

గన్నవరం టికెట్ ఇస్తే రూ.150కోట్లు ఖర్చుకు రెఢీగా ఉన్నారట

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీడీపీ సీనియర్ నేత.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయన ఏం చేసినా.. మరేం మాట్లాడినా సంచలనం అన్నట్లుగా ఉంటుంది. తాజాగా ఆయన గన్నవరం అసెంబ్లీ స్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు ఒక వ్యక్తి వచ్చారని.. గన్నవరం సీటును తనకు ఇస్తే.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సదరు వ్యక్తి చెప్పారన్నారు.
అయితే.. గన్నవరం నియోజకవర్గం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతామన్న చింతమనేని.. ఓట్లకు ఖర్చు పెట్టే వ్యక్తిని కాదు మీసం మెలేసే దమ్మున్న వ్యక్తిని బరిలోకి దింపుతామని పేర్కొన్నారు. ఒకరు పోతే వంద మంది వస్తారంటూ వల్లభనేని వంశీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డిలు నిర్దోషులుగా వస్తారంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన చింతమనేని.. అవినాశ్ రెడ్డిపైన కేసు పెట్టింది చంద్రబాబు కాదని.. స్వయాన సీబీఐ పెట్టిందని గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డి ప్రమేయం లేకుంటే సీబీఐ కేసు ఎందుకు పెడుతుంది? అని ప్రశ్నించారు. జగన్ చెల్లి సునీత మీపై కేసు పెట్టిందంటే హత్య ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చన్న చింతమనేని.. ‘అవినాశ్ రెడ్డి అరెస్టు అనగానే ముఖ్యమంత్రిజగన్ ఢిల్లీ వెళ్లిపోతున్నారు. ప్రధాని మోడీ.. హోం మంత్రి అమిత్ షాలను కలిసి కాళ్లు పట్టుకొని మీడియాకు మాత్రం రాష్ట్ర విభజన హామీల కోసం అని చెప్పటం విడ్డూరంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.

సొంత చెల్లిలినే రాష్ట్రం నుంచి వెళ్లగొడితే పక్క రాష్ట్రంలోకి వెళ్లి పార్టీ పెట్టుకున్నారన్న చింతమనేని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా చింతమనేని చేసిన హడావుడిపై పలువురు మండిపడుతున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీవార్డులోకి వందల మందితో వచ్చి పండ్లు పంచే కార్యక్రమాన్ని చేపట్టటంపై పలువురు మండిపడుతున్నారు. ఐసీయూలోకి మామిడి పండ్లను బండితో తీసుకెళ్లి పంచే ప్రోగ్రాంను చూసి.. రోగులు.. వైద్యులు ఆశ్చర్యపోయారంటున్నారు. సాధారణంగా ఐసీయూలోకి బయట వాళ్లను ఎవరిని అనుమతించరు. అందుకు భిన్నంగా పుట్టిన రోజు సందర్భంగా చింతమనేని చేసిన హడావుడిని పలువురు తప్పు పడుతుండటం గమనార్హం.

This post was last modified on April 21, 2023 12:13 pm

Share
Show comments

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

27 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago