బీజేపీ, వైసీపీల మధ్య బంధం బ్రదర్ ఫ్రం ఎనదర్ మదర్ అన్నట్లుగా సాగుతోంది ఇంతవరకు. ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతున్నారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి ఈ అన్యోన్య బంధంలో ఆటుపోట్లు తప్పవని తెలుస్తోంది. జగన్ ఎంత అణకువగా ఉన్నప్పటికీ ఏపీలో పట్టు కోసం కాచుక్కూచున్న బీజేపీ తన పని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్లో ఉందని.. కొద్దిరోజులలో ఆ వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.
జగన్ పట్ల ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకతను ఏపీ బీజేపీకి చెందిన కొందరు నేతలు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నిత్యం చేరవేస్తుండడంతో పైనుంచి వ్యూహం మారుతోందని.. వైసీపీ నుంచి చేరికలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు. నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ వంటివారు ఏపీలో వైసీపీ విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పాజిటివ్ నివేదికలే ఇస్తున్నారు. అయితే.. రాయలసీమకు చెందిన ఓ బీజేపీ నేత రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంలోని బీజేపీ నేతలకు సమాచారం ఇస్తుండడంతో వారు కూడా ఆలోచనలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పొరుగునే ఉన్న రాయలసీమ బీజేపీకి చెందిన కొందరు నేతలతోనూ బీజేపీ పెద్దలు మాట్లాడాక ఏపీపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్లో కామ్గా ఉన్న కొందరు సీనియర్లను తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉంది. ఈ కాంటాక్ట్స్తోనే వైసీపీ నుంచి కూడా వలసలు మొదలవబోతున్నట్లు చెప్తున్నారు. అధికార పార్టీ నుంచి తమ పార్టీలోకి వలసలు కనుక మొదలైతే క్రమంగా పార్టీ పరిస్థితి మారుతుందని బీజేపీ నేతలు ఆశావహంగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండడం.. పవన్ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో బీజేపీ కూడా ఆచితూచి అడుగేస్తూ రాష్ట్రంలో పరిస్థితులను ఓ కంట కనిపెడుతోంది. అయితే.. అవకాశం దొరికితే జగన్కు షాకివ్వడానికి బీజేపీ ఏమాత్రం మొహమాట పడబోదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
This post was last modified on April 20, 2023 7:23 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…