Political News

అయోధ్య భూమిపూజకు మోడీ గైర్హాజరు?

అనూహ్య పరిణామాల నేపథ్యం.. మరో కీలక పరిణామానికి కారణంగా మారుతుందా? ఏళ్లకు ఏళ్ల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజుకు దగ్గరగా వచ్చిన వేళ.. అనూహ్యంగా వచ్చి పడిన కరోనా మహమ్మారి ప్రధాని మోడీకి ఇబ్బందిగా మారనుందా? అన్నదిప్పుడుప్రశ్నగా మారింది. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన్ను నిత్యం కలుస్తూ.. చర్చలు జరిపే ఏకైక నేతగా అమిత్ షాను అభివర్ణిస్తారు.

అలాంటి ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలటం ప్రధాని మోడీకి ఇబ్బందికరంగా మారినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఐదున అయోధ్యలో రామాలయానికి భూమిపూజకు ముహుర్తంగా నిర్ణయించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా పలువురుప్రముఖులు హాజరు కానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి.

ఇలాంటివేళ.. అనూహ్యంగా ఆదివారం సాయంత్రం అమిత్ షాకు పాజిటివ్ గా తేలటంతో మోడీ పరివారం షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. షా పాజిటివ్ రిపోర్టు.. ఎంతమంది మంత్రులకు వ్యాపించే అవకాశం ఉందా? అన్నది ప్రశ్న. ఒక విధంగా చూస్తే..అమిత్ షా ప్రైమరీ కాంటాక్టు కింద ప్రధాని మోడీ ఉంటారు.

అలాంటప్పుడు ఆయన కనీసం పది రోజులు హోం ఐసోలేషన్ ఉండాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే.. భూమిపూజకు మోడీ హాజరయ్యే అవకాశాలు తక్కువేనన్న గా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అలాంటి అనుమానాలు అక్కర్లేదనని.. అయోధ్యకు ప్రధాని మోడీ పక్కా వెళతారని బీజేపీ వర్గాలు చెబుతున్నారు. భూమిపూజకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో .. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయోధ్యలో భూమిపూజ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తే.. సరిగా అదే సందర్భంలో కరోనా రూపంలో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు.

ముహుర్తానికి మరికొంత టైం ఉన్న వేళ.. ఇప్పుడు ఊహించేవన్ని ఊహలేనని.. వెయిట్ చేయటం మినహా చేయగలిగింది ఏమీ లేదన్న మాట మరికొందరి నోటి నుంచి వస్తోంది. భూమిపూజపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

This post was last modified on August 3, 2020 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

9 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago