అనూహ్య పరిణామాల నేపథ్యం.. మరో కీలక పరిణామానికి కారణంగా మారుతుందా? ఏళ్లకు ఏళ్ల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజుకు దగ్గరగా వచ్చిన వేళ.. అనూహ్యంగా వచ్చి పడిన కరోనా మహమ్మారి ప్రధాని మోడీకి ఇబ్బందిగా మారనుందా? అన్నదిప్పుడుప్రశ్నగా మారింది. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన్ను నిత్యం కలుస్తూ.. చర్చలు జరిపే ఏకైక నేతగా అమిత్ షాను అభివర్ణిస్తారు.
అలాంటి ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలటం ప్రధాని మోడీకి ఇబ్బందికరంగా మారినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఐదున అయోధ్యలో రామాలయానికి భూమిపూజకు ముహుర్తంగా నిర్ణయించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా పలువురుప్రముఖులు హాజరు కానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి.
ఇలాంటివేళ.. అనూహ్యంగా ఆదివారం సాయంత్రం అమిత్ షాకు పాజిటివ్ గా తేలటంతో మోడీ పరివారం షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. షా పాజిటివ్ రిపోర్టు.. ఎంతమంది మంత్రులకు వ్యాపించే అవకాశం ఉందా? అన్నది ప్రశ్న. ఒక విధంగా చూస్తే..అమిత్ షా ప్రైమరీ కాంటాక్టు కింద ప్రధాని మోడీ ఉంటారు.
అలాంటప్పుడు ఆయన కనీసం పది రోజులు హోం ఐసోలేషన్ ఉండాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే.. భూమిపూజకు మోడీ హాజరయ్యే అవకాశాలు తక్కువేనన్న గా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలాంటి అనుమానాలు అక్కర్లేదనని.. అయోధ్యకు ప్రధాని మోడీ పక్కా వెళతారని బీజేపీ వర్గాలు చెబుతున్నారు. భూమిపూజకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో .. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయోధ్యలో భూమిపూజ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తే.. సరిగా అదే సందర్భంలో కరోనా రూపంలో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు.
ముహుర్తానికి మరికొంత టైం ఉన్న వేళ.. ఇప్పుడు ఊహించేవన్ని ఊహలేనని.. వెయిట్ చేయటం మినహా చేయగలిగింది ఏమీ లేదన్న మాట మరికొందరి నోటి నుంచి వస్తోంది. భూమిపూజపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on August 3, 2020 10:57 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…