అనూహ్య పరిణామాల నేపథ్యం.. మరో కీలక పరిణామానికి కారణంగా మారుతుందా? ఏళ్లకు ఏళ్ల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజుకు దగ్గరగా వచ్చిన వేళ.. అనూహ్యంగా వచ్చి పడిన కరోనా మహమ్మారి ప్రధాని మోడీకి ఇబ్బందిగా మారనుందా? అన్నదిప్పుడుప్రశ్నగా మారింది. ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా.. ఆయన్ను నిత్యం కలుస్తూ.. చర్చలు జరిపే ఏకైక నేతగా అమిత్ షాను అభివర్ణిస్తారు.
అలాంటి ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలటం ప్రధాని మోడీకి ఇబ్బందికరంగా మారినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల ఐదున అయోధ్యలో రామాలయానికి భూమిపూజకు ముహుర్తంగా నిర్ణయించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో సహా పలువురుప్రముఖులు హాజరు కానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి.
ఇలాంటివేళ.. అనూహ్యంగా ఆదివారం సాయంత్రం అమిత్ షాకు పాజిటివ్ గా తేలటంతో మోడీ పరివారం షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. షా పాజిటివ్ రిపోర్టు.. ఎంతమంది మంత్రులకు వ్యాపించే అవకాశం ఉందా? అన్నది ప్రశ్న. ఒక విధంగా చూస్తే..అమిత్ షా ప్రైమరీ కాంటాక్టు కింద ప్రధాని మోడీ ఉంటారు.
అలాంటప్పుడు ఆయన కనీసం పది రోజులు హోం ఐసోలేషన్ ఉండాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే.. భూమిపూజకు మోడీ హాజరయ్యే అవకాశాలు తక్కువేనన్న గా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలాంటి అనుమానాలు అక్కర్లేదనని.. అయోధ్యకు ప్రధాని మోడీ పక్కా వెళతారని బీజేపీ వర్గాలు చెబుతున్నారు. భూమిపూజకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో .. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయోధ్యలో భూమిపూజ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తే.. సరిగా అదే సందర్భంలో కరోనా రూపంలో కొత్త టెన్షన్ మొదలైందని చెబుతున్నారు.
ముహుర్తానికి మరికొంత టైం ఉన్న వేళ.. ఇప్పుడు ఊహించేవన్ని ఊహలేనని.. వెయిట్ చేయటం మినహా చేయగలిగింది ఏమీ లేదన్న మాట మరికొందరి నోటి నుంచి వస్తోంది. భూమిపూజపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on August 3, 2020 10:57 am
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…