అంబటి రాయుడు.. క్రికెట్ పాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో, అలాగే ఐపీఎల్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లతో మంచి పాపులారిటీనే సంపాదించాడు ఈ టాలెంటెడ్ క్రికెటర్. 37 ఏళ్ల వయసులో ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నైకి ఆడుతూ. కెరీర్ చరమాంకంలో ఉన్న అతను త్వరలో ఆటకు టాటా చెబుతాడనే అంచనాలున్నాయి.
క్రికెట్ నుంచి తప్పుకోగానే అతను రాజకీయాల్లోకి వస్తాడనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని.. తెలుగుదేశం పార్టీతో అతను టచ్లో ఉన్నాడని ఇటీవల జోరుగావార్తలు వచ్చాయి. రాయుడికి టికెట్ ఇచ్చే విషయంలో టీడీపీ కూడా సానుకూలంగానే ఉందని ప్రచారం జరిగింది. మరోవైపు జనసేన సైతం రాయుడిని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి.
కట్ చేస్తే.. అంబటి రాయుడు బుధవారం వేసిన ఒక ట్వీట్తో అందరికీ దిమ్మదిరిగిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చేసిన ప్రసంగం తాలూకు వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో పోస్ట్ చేయగా.. దానిపై రాయుడు స్పందిస్తూ.. గొప్ప ప్రసంగం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు.. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మీ మీద పూర్తి నమ్మకం కలిగి ఉన్నారు సార్ అని పేర్కొన్నాడు.
టీడీపీలో చేరతాడనుకున్న వాడు.. ఇలా జగన్ను పొగుడుతూ ట్వీట్ వేసేసరికి నెటిజన్లు షాకయ్యారు. టీడీపీ వాళ్లతో పాటు జనసైనికులు కూడా అతడిని తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ఐతే టీడీపీతో టచ్లోకి వెళ్లాక.. ఆ పార్టీ నేతలు తనను సరిగా పట్టించుకోని నేపథ్యంలో వారికి హెచ్చరికలు జారీ చేసేలా రాయుడు ఇలా ట్వీట్ వేశాడనే మాట రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on April 20, 2023 9:15 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…