ఏ ప్రభుత్వమైనా.. ఖజానా ఖాళీ అయిపోయిందని ఇప్పటి వరకు ప్రకటించిన సందర్భాలు లేవు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న అస్సాం, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ప్రకటన చేయలేదు. కానీ, తొలి సారి 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏపీ ప్రభుత్వం స్వయంగా ఖజానా ఖాళీ అయిందని ప్రకటించి.. సంచలనం రేపింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు.
ఈ నెలలో షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం విద్యార్థులకు వసతి దీవెన పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే.. దీనిని వాయిదా వేసింది. ఇదే విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తొలిసారి మీడియా మీటింగ్ పెట్టడం సంచలనంగా మారింది. ఏప్రిల్ నెలలో ఆదాయ వనరుల సమస్యలు ఉంటాయని.. ఆశించిన మొత్తాలు రాకపోవడం వల్ల షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని జవహర్రెడ్డి వెల్లడించారు.
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లోటు సమస్యలుంటాయని, అయితే రానున్న రోజుల్లో సంక్షేమ క్యాలెండర్ అమలుకు నిధుల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని జవహర్రెడ్డి చెప్పారు. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా.. కష్టపడి అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కూడా పదే పదే చెబుతున్నారు.
కానీ ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బుల్లేవు.. అందుకే వసతి దీవెన పథకం వాయిదా వేస్తున్నామని అధికారికంగా ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్లను తెచ్చుకోకపోగా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సు అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, కేంద్రం అడ్వాన్స్ అప్పులు ఇచ్చేందుకు విముఖ త వ్యక్తం చేసింది. దీంతో ఖజానా ఖాళీ అయిందని ప్రకటించినట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరో 10 రోజులు ఇదే పరిస్థితి ఉంటే..ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు.
This post was last modified on April 19, 2023 10:31 am
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…