Political News

ఖ‌జానా ఖాళీ.. చేతులెత్తేసిన ఏపీ ప్ర‌భుత్వం!

ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు లేవు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న అస్సాం, యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ, తొలి సారి 75 సంవ‌త్స‌రాల భార‌త దేశ చ‌రిత్ర‌లో ఏపీ ప్ర‌భుత్వం స్వ‌యంగా ఖ‌జానా ఖాళీ అయిందని ప్ర‌క‌టించి.. సంచ‌ల‌నం రేపింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ చెప్పారు.

ఈ నెల‌లో షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు వసతి దీవెన పథకం అమలు చేయాల్సి ఉంది. అయితే.. దీనిని వాయిదా వేసింది. ఇదే విష‌యాన్ని చెప్పేందుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తొలిసారి మీడియా మీటింగ్ పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏప్రిల్‌ నెలలో ఆదాయ వనరుల సమస్యలు ఉంటాయని.. ఆశించిన మొత్తాలు రాకపోవడం వల్ల షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని జవహర్‌రెడ్డి వెల్లడించారు.

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లోటు సమస్యలుంటాయని, అయితే రానున్న రోజుల్లో సంక్షేమ క్యాలెండర్‌ అమలుకు నిధుల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా.. కష్టపడి అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి కూడా ప‌దే ప‌దే చెబుతున్నారు.

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా డబ్బుల్లేవు.. అందుకే వసతి దీవెన పథకం వాయిదా వేస్తున్నామని అధికారికంగా ప్రకటించడం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి కేంద్రం ఇవ్వాల్సిన గ్రాంట్లను తెచ్చుకోకపోగా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్సు అప్పు తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. కానీ, కేంద్రం అడ్వాన్స్ అప్పులు ఇచ్చేందుకు విముఖ త వ్య‌క్తం చేసింది. దీంతో ఖ‌జానా ఖాళీ అయింద‌ని ప్ర‌క‌టించిన‌ట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ‌రో 10 రోజులు ఇదే ప‌రిస్థితి ఉంటే..ఏపీలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

This post was last modified on April 19, 2023 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

57 minutes ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

4 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

7 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

7 hours ago