ఎంబీబీఎస్, ఎండీ అనే ఇంగ్లీష్ వైద్య చదువులు చదివిన వారి దగ్గరకే తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం మంది వెళ్తుంటారు. మూఢనమ్మకాలకు అవకాశం లేకుండా పరిశోధనాత్మకంగా తయారైన ఔషధాలను రాసిస్తారన్న నమ్మకంతోనూ, ఆ మందులను వాడితే త్వరగా రోగం నయమవుతుందన్న విశ్వాసంతోనూ ఆస్పత్రుల దగ్గర జనం బారులు తీరుతుంటారు. 30 సంవత్సరాలకు పైగా ఇంగ్లీషు మందులిచ్చిన ఒక వైద్యుడు మాత్రం ఇప్పుడు రూటు మార్చాడు…
తాయత్తే కాపాడిందని డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన..
తెలంగాణకు ఒక హెల్త్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన పేరు డాక్టర్ గడల శ్రీనివాసరావు. అయనకు సైన్స్ తో సంబంధం లేదు. ఏది కావాలంటే అది మాట్లాడతారు. ఒక సందర్భంలో అనారోగ్యం పాలైతే తన తాతయ్య, అమ్ముమ్మ తాయత్తు కట్టించారని దానితో తాను బతికి బయట పడ్డానని డీహెచ్ చెప్పుకున్నారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన ఇప్తార్ విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో అనారోగ్యంతో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు పెద్దలు మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారట
ఏసు ప్రభువు కాపాడాడు..
ఒక సందర్భంలో తనను ఏసు ప్రభువు కాపాడాడని కూడా శ్రీనివాసరావు చెప్పుకున్నారు. కరోనా నుంచి మానవాళిని ఏసు ప్రభువే కాపాడారని చెప్పి విమర్శల పాలయ్యారు. మరో సందర్భంలో ఆయన మిరపకాయల హోమం చేయించి అందరి విమర్శలకు లోనయ్యారు..
కేసీఆర్ కు తరచూ పాదాభివందనం..
డీహెచ్ శ్రీనివాసరావు , బీఆర్ఎస్ లో కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నారు. దానితో ఎక్కడ బడితే అక్కడ సీఎం కేసీఆర్ కు పాదాభివదనం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా కాళ్లకు మొక్కడంతో కేసీఆర్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. కొత్తగూడెంలో మంచి పేరు సంపాదించుకునేందుకు ఆయన జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య క్యాంపులు, జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తూ జనంలో నానుతున్నారు.
శ్రీనివాసరావు దూకుడుతో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు టెన్షన్ పట్టుకుంది. కేసీఆర్ ఆయనకు టికెట్ ఇచ్చి తనకు ఎగ్గొడ్డతారేమోనన్న భయం ఆయనలో పెరుగుతోంది. ఏదేమైనా.. అన్నీ శ్రీనివాసరావు అనుకున్నట్లే జరిగి ఎమ్మెల్యే అయితే అదీ కూడా తాయత్తు మహిమ అంటారేమో. ఏమో తాయత్తు మహిమతో ఆయనే ఆరోగ్య మంత్రి కూడా కావచ్చు. ఎలాగూ డాక్టర్ కదా…
This post was last modified on April 18, 2023 1:39 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…