ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ సర్కిళ్ళల్లో పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నరేంద్రమోడీకి కంట్లో నలుసులాగ, పంటికింద రాయిలాగ తయారయ్యారు కేజ్రీవాల్. దేశంలోని చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీ ఏలుబడిలోకి వస్తున్నా ఢిల్లీలో పాగా వేయటం మాత్రం సాధ్యంకావటంలేదు. ఎంతగా పోరాడినా, ఏ పద్దతిలో పోరాటాలు చేస్తున్నా కేజ్రీవాల్ ను ఓడించటం నరేంద్రమోడీ వల్ల కావటంలేదు.
ఇక్కడ బీజేపీ అని కాకుండా మోడీ పేరును మాత్రమే ఎందుకు ప్రస్తావించాల్సొచ్చింది ? ఎందుకంటే మైనస్ మోడీ బీజేపీ దాదాపు జీరో కాబట్టే. ప్రధానమంత్రి కుర్చీనుండి మోడీ పక్కకు తప్పుకున్న తర్వాత బీజేపీ వైభవం చూడాలి ఎలాగుంటుందో. తాను పక్కకు తప్పుకునే లోగానే ఢిల్లీని కూడా బీజేపీ పాలనలోకి తీసుకురావాలన్న కల సాకారం కావటంలేదు. మూడుసార్లుగా కేజ్రీవాల్ గెలుస్తునే ఉన్నారు. మూడోసారి గెలవటమైతే మోడీకి పెద్ద షాక్ లాంటిదే.
అందుకనే ఎలాగైనా కేజ్రీవాల్ అడ్డు తొలగించుకుంటే కానీ ఢిల్లీ బీజేపీకి దక్కదనే విషయం అర్ధమైపోయింది. ఏమిచేయాలో దిక్కుతోచని స్ధితిలో సరిగ్గా లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇప్పటివరకు కేజ్రీవాల్ పైన ఎక్కడా అవినీతిపరుడనే మరక కూడా లేదు. అలాంటిది మొదటిసారి లిక్కర్ స్కామ్ లో కేజ్రీ పేరు రావటం ఆశ్చర్యంగానే ఉంది. సరే కారణాలు ఏవైనా కానీండి కేజ్రీని సిబీఐ మొదటిసారి విచారించింది. దాదాపు 9 గంటలపాటు 56 ప్రశ్నలు వేసినట్లు సీఎమ్మే చెప్పారు. తాను అన్నింటికీ సమాధానాలు కూడా చెప్పానన్నారు.
ప్రశ్నలు ఏవైనా, సమాధానాలు ఏమి చెప్పినా ఇపుడు గనుక కేజ్రీని పట్టుకోకపోతే ముందు ముందు దొరుకుతారనే గ్యారెంటీలేదు. ఇలాంటి కుట్రల్లో తనను ఇరికించి మోడీ తనను అరెస్టు చేయించేందుకు ప్లాన్ చేసినట్లు కేజ్రీ కూడా బహిరంగంగానే ఆరోపించారు. అంటే కేజ్రీ కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో, మార్గమేదైనా సరే ప్రత్యర్ధులను అడ్డుతొలగించుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా ప్రతిపక్షాల నేతలు నానా గోలచేస్తున్నారు. అయితే వీళ్ళ గోలను ఎవరు పట్టించుకుంటారు ?
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…