ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ సర్కిళ్ళల్లో పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నరేంద్రమోడీకి కంట్లో నలుసులాగ, పంటికింద రాయిలాగ తయారయ్యారు కేజ్రీవాల్. దేశంలోని చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీ ఏలుబడిలోకి వస్తున్నా ఢిల్లీలో పాగా వేయటం మాత్రం సాధ్యంకావటంలేదు. ఎంతగా పోరాడినా, ఏ పద్దతిలో పోరాటాలు చేస్తున్నా కేజ్రీవాల్ ను ఓడించటం నరేంద్రమోడీ వల్ల కావటంలేదు.
ఇక్కడ బీజేపీ అని కాకుండా మోడీ పేరును మాత్రమే ఎందుకు ప్రస్తావించాల్సొచ్చింది ? ఎందుకంటే మైనస్ మోడీ బీజేపీ దాదాపు జీరో కాబట్టే. ప్రధానమంత్రి కుర్చీనుండి మోడీ పక్కకు తప్పుకున్న తర్వాత బీజేపీ వైభవం చూడాలి ఎలాగుంటుందో. తాను పక్కకు తప్పుకునే లోగానే ఢిల్లీని కూడా బీజేపీ పాలనలోకి తీసుకురావాలన్న కల సాకారం కావటంలేదు. మూడుసార్లుగా కేజ్రీవాల్ గెలుస్తునే ఉన్నారు. మూడోసారి గెలవటమైతే మోడీకి పెద్ద షాక్ లాంటిదే.
అందుకనే ఎలాగైనా కేజ్రీవాల్ అడ్డు తొలగించుకుంటే కానీ ఢిల్లీ బీజేపీకి దక్కదనే విషయం అర్ధమైపోయింది. ఏమిచేయాలో దిక్కుతోచని స్ధితిలో సరిగ్గా లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇప్పటివరకు కేజ్రీవాల్ పైన ఎక్కడా అవినీతిపరుడనే మరక కూడా లేదు. అలాంటిది మొదటిసారి లిక్కర్ స్కామ్ లో కేజ్రీ పేరు రావటం ఆశ్చర్యంగానే ఉంది. సరే కారణాలు ఏవైనా కానీండి కేజ్రీని సిబీఐ మొదటిసారి విచారించింది. దాదాపు 9 గంటలపాటు 56 ప్రశ్నలు వేసినట్లు సీఎమ్మే చెప్పారు. తాను అన్నింటికీ సమాధానాలు కూడా చెప్పానన్నారు.
ప్రశ్నలు ఏవైనా, సమాధానాలు ఏమి చెప్పినా ఇపుడు గనుక కేజ్రీని పట్టుకోకపోతే ముందు ముందు దొరుకుతారనే గ్యారెంటీలేదు. ఇలాంటి కుట్రల్లో తనను ఇరికించి మోడీ తనను అరెస్టు చేయించేందుకు ప్లాన్ చేసినట్లు కేజ్రీ కూడా బహిరంగంగానే ఆరోపించారు. అంటే కేజ్రీ కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో, మార్గమేదైనా సరే ప్రత్యర్ధులను అడ్డుతొలగించుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా ప్రతిపక్షాల నేతలు నానా గోలచేస్తున్నారు. అయితే వీళ్ళ గోలను ఎవరు పట్టించుకుంటారు ?
This post was last modified on April 17, 2023 11:15 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…