ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ సర్కిళ్ళల్లో పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నరేంద్రమోడీకి కంట్లో నలుసులాగ, పంటికింద రాయిలాగ తయారయ్యారు కేజ్రీవాల్. దేశంలోని చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీ ఏలుబడిలోకి వస్తున్నా ఢిల్లీలో పాగా వేయటం మాత్రం సాధ్యంకావటంలేదు. ఎంతగా పోరాడినా, ఏ పద్దతిలో పోరాటాలు చేస్తున్నా కేజ్రీవాల్ ను ఓడించటం నరేంద్రమోడీ వల్ల కావటంలేదు.
ఇక్కడ బీజేపీ అని కాకుండా మోడీ పేరును మాత్రమే ఎందుకు ప్రస్తావించాల్సొచ్చింది ? ఎందుకంటే మైనస్ మోడీ బీజేపీ దాదాపు జీరో కాబట్టే. ప్రధానమంత్రి కుర్చీనుండి మోడీ పక్కకు తప్పుకున్న తర్వాత బీజేపీ వైభవం చూడాలి ఎలాగుంటుందో. తాను పక్కకు తప్పుకునే లోగానే ఢిల్లీని కూడా బీజేపీ పాలనలోకి తీసుకురావాలన్న కల సాకారం కావటంలేదు. మూడుసార్లుగా కేజ్రీవాల్ గెలుస్తునే ఉన్నారు. మూడోసారి గెలవటమైతే మోడీకి పెద్ద షాక్ లాంటిదే.
అందుకనే ఎలాగైనా కేజ్రీవాల్ అడ్డు తొలగించుకుంటే కానీ ఢిల్లీ బీజేపీకి దక్కదనే విషయం అర్ధమైపోయింది. ఏమిచేయాలో దిక్కుతోచని స్ధితిలో సరిగ్గా లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇప్పటివరకు కేజ్రీవాల్ పైన ఎక్కడా అవినీతిపరుడనే మరక కూడా లేదు. అలాంటిది మొదటిసారి లిక్కర్ స్కామ్ లో కేజ్రీ పేరు రావటం ఆశ్చర్యంగానే ఉంది. సరే కారణాలు ఏవైనా కానీండి కేజ్రీని సిబీఐ మొదటిసారి విచారించింది. దాదాపు 9 గంటలపాటు 56 ప్రశ్నలు వేసినట్లు సీఎమ్మే చెప్పారు. తాను అన్నింటికీ సమాధానాలు కూడా చెప్పానన్నారు.
ప్రశ్నలు ఏవైనా, సమాధానాలు ఏమి చెప్పినా ఇపుడు గనుక కేజ్రీని పట్టుకోకపోతే ముందు ముందు దొరుకుతారనే గ్యారెంటీలేదు. ఇలాంటి కుట్రల్లో తనను ఇరికించి మోడీ తనను అరెస్టు చేయించేందుకు ప్లాన్ చేసినట్లు కేజ్రీ కూడా బహిరంగంగానే ఆరోపించారు. అంటే కేజ్రీ కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సో, మార్గమేదైనా సరే ప్రత్యర్ధులను అడ్డుతొలగించుకోవటమే నరేంద్రమోడీ టార్గెట్ గా ప్రతిపక్షాల నేతలు నానా గోలచేస్తున్నారు. అయితే వీళ్ళ గోలను ఎవరు పట్టించుకుంటారు ?
This post was last modified on April 17, 2023 11:15 am
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…