Political News

వివేకా హ‌త్య కేసులో.. ఎంపీ అవినాష్ తండ్రి అరెస్టు

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో వేగం పెంచింది. కడప వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి, వైసీపీ నాయ‌కుడు వైఎస్ భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ అధికారులు ఈ రోజు ఉద‌యం 6.40 గంట‌ల స‌మ‌యంలో పులివెందుల‌లోని ఆయ‌న స్వ‌గృహంలో అరెస్టు చేశారు. హైద‌రాబాద్ నుంచి గ‌త రాత్రి సీబీఐ బృందాలు క‌డప చేరుకున్న‌ట్టు స‌మాచారం.అయితే.. ఎవ‌రి కంటా ప‌డ‌కుండా.. అత్యంత ర‌హ‌స్యంగా ఉన్న అధికారులు ఉద‌య‌మే రంగంలోకి దిగారు.

పులివెందుల‌లోని వైఎస్ భాస్క‌ర‌రెడ్డి ఇంటికి రెండు బృందాలుగా వెళ్లిన సీబీఐ అధికారులు.. వివేకా హ‌త్య కేసుకు సంబంధించి తొలుత ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. అనంత‌రం.. ఆయ‌న‌ను అరెస్టు చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా భాస్క‌ర‌రెడ్డి భార్య‌కు అరెస్టు నోటీసు ఇచ్చి.. ఆ వెంట‌నే భాస్క‌ర‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సెల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భాస్క‌రరెడ్డి అరెస్టు అనంత‌రం.. ప్ర‌త్యేక వాహ‌నంలో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్నారు. వాహ‌నం లోనే ప్ర‌త్యేకంగా వైద్య సేవ‌లు అందించే ఏర్పాట్లు చేసిన‌ట్టు స‌మాచారం. కాగా, ప‌ది రోజుల కింద‌ట భాస్క‌ర‌రెడ్డిని విచారించేందుకు సీబీఐ పిలిచిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆయ‌న క‌డ‌ప‌లోని జైలు గెస్ట్ హౌస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని.. పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో వివేకానంద‌రెడ్డి రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని ఎందుకు విచారించ‌డం లేద‌ని కూడా ప్ర‌శ్నించారు.

త‌న‌ను అరెస్టు చేసినా.. ఇబ్బందిలేద‌ని భాస్క‌ర‌రెడ్డి అప్పుడే చెప్పారు. తాను అనారోగ్యంతో ఉన్నాన‌ని.. కేవ‌లం త‌మ ఇంటి పేరు వైఎస్ కావ‌డంతోనే వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. ఆయ‌న ఆరోపించారు. కాగా, తాజా అరెస్టుతో క‌డ‌ప‌లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. పోలీసులు 144 సెక్ష‌న్ విధించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 16, 2023 9:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

16 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

5 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago