ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాలూకు ఆనవాళ్లను, సాక్ష్యాలను.. ఎవరు చెరిపేశారో.. ఎవరెవరు చేతులు కలిపారో.. పూస గుచ్చినట్టు సీఐబీ వివరించింది. వివేకా హత్య ఆనవాళ్లను.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రితో కలిసి ఉదయ్ చెరిపేశాడని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. రెండు రోజుల కిందట గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో.. ఆయన ను ఎందుకు రిమాండ్కు పంపించాలో కూడా సీబీఐ స్పష్టం చేసింది.
గుండె పోటు ప్లాన్ వీరిదే!
వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా హత్య కేసు ఆధారాల చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారు. వివేకానంద రెడ్డి హత్యకు గురైన స్థలంలోని ఆధారాలను ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చెరిపేశారు. విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్ను అరెస్టు చేశాం. కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు.
ఆ తెల్లవారు జామున ఏం జరిగిందంటే..
సీబీఐ వెల్లడించిన దానిని బట్టి.. వివేకా హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉదయ్ కుమార్ ఉన్నారు. హత్య రోజు తెల్లవారుజామున అవినాష్ ఇంట్లోనే శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారు. హత్య తెలియగానే ఆధారాల చెరిపివేతకు అవినాష్ ఇంట్లో ఎదురుచూశారు. అవినాష్కు శివప్రకాశ్ రెడ్డి ఫోన్చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారు. అవినాష్ ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు ఉన్నారు. అవినాష్ ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా గుర్తించాం. అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికెళ్లినట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా గుర్తించాం. అని సీబీఐ వివరించింది.
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…