Political News

వివేకా హ‌త్య : సీబీఐ సంచ‌ల‌న విష‌యాలు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు తాలూకు ఆన‌వాళ్ల‌ను, సాక్ష్యాల‌ను.. ఎవ‌రు చెరిపేశారో.. ఎవ‌రెవ‌రు చేతులు క‌లిపారో.. పూస గుచ్చిన‌ట్టు సీఐబీ వివ‌రించింది. వివేకా హ‌త్య ఆన‌వాళ్ల‌ను.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయ‌న తండ్రితో క‌లిసి ఉద‌య్ చెరిపేశాడ‌ని సీబీఐ త‌న రిమాండ్ రిపోర్టులో స్ప‌ష్టం చేసింది. రెండు రోజుల కింద‌ట గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వ‌చ్చిందో.. ఆయ‌న ను ఎందుకు రిమాండ్‌కు పంపించాలో కూడా సీబీఐ స్ప‌ష్టం చేసింది.

గుండె పోటు ప్లాన్ వీరిదే!
వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా హత్య కేసు ఆధారాల చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారు. వివేకానంద రెడ్డి హత్యకు గురైన స్థలంలోని ఆధారాలను ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయి. భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్‌ చెరిపేశారు. విచారణకు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి సహకరించట్లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్‌ను అరెస్టు చేశాం. కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు.

ఆ తెల్ల‌వారు జామున ఏం జ‌రిగిందంటే..
సీబీఐ వెల్ల‌డించిన దానిని బ‌ట్టి.. వివేకా హత్య రోజు తెల్లవారుజామున అవినాష్‌ రెడ్డి ఇంట్లోనే ఉదయ్‌ కుమార్ ఉన్నారు. హత్య రోజు తెల్లవారుజామున అవినాష్‌ ఇంట్లోనే శివశంకర్‌ రెడ్డి కూడా ఉన్నారు. హత్య తెలియగానే ఆధారాల చెరిపివేతకు అవినాష్ ఇంట్లో ఎదురుచూశారు. అవినాష్‌కు శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చారు. అవినాష్‌ ఇంట్లో ఉదయ్‌ కుమార్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డిలు ఉన్నారు. అవినాష్ ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా కూడా గుర్తించాం. అవినాష్‌ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికెళ్లినట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించాం. అని సీబీఐ వివ‌రించింది.

This post was last modified on April 15, 2023 9:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

21 minutes ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

3 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

5 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

5 hours ago

ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై సింపతీ పోయిందా?

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…

6 hours ago

పైరసీని ఆపడానికి యాప్

సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…

6 hours ago