Political News

సీఎం జ‌గ‌న్‌కు కొత్త‌పేరు పెట్టిన నారా లోకేష్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై త‌ర‌చుగా విరుచుకుప‌డే టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో దూకుడుగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌కీయం ప‌రంగా చూస్తే.. సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ప‌లు పేర్లు పెడుతున్నారు. ఇప్ప‌టికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సంద‌ర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపుల‌ర్ అయింది.

త‌ర్వాత కాలంలో క‌రోనాతో పోలుస్తూ.. నారా లోకేష్ జ‌గ‌న్‌ను ఏకేశారు. “ప్ర‌పంచాన్ని ప‌ట్టుకున్న క‌రోనా వైర‌స్‌ను వ‌దిలించుకునేందుకు నెల రోజులు క్వారంటైన్‌లో ఉంటే చాలు. కానీ, రాష్ట్రానికి ప‌ట్టిన ‘జ‌గ‌నో రా’ వైరస్‌ను వ‌దిలించుకునేందుకు మ‌రో మూడేళ్లు వెయిట్ చేయాలి” అని నారా లోకేష్ వ్యాఖ్యానించి.. చ‌ర్చ‌నీయాంశం చేశారు. అదేవిధంగా జ‌గ‌న్ కాదు.. గ‌జ‌నీ అని ప‌లుసంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కాదు.. ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న ‘జ‌ల‌గ’ మోహ‌న్‌రెడ్డి అని ప‌లు చోట్ల చెప్పుకొచ్చారు.

ఇక‌, ప‌లు సంద‌ర్భాల్లో ‘సైకో రెడ్డి’ , ‘జాదూ రెడ్డి’ అంటూ.. నారా లోకేష్ విజృంభించారు. ఇక‌, ఈ ప‌రంపర‌లోనే.. తాజాగా సీఎం జ‌గ‌న్‌కు నారా లోకేష్ మరో పెట్టారు. ‘రిచ్ మోహ‌న్‌’ అని నారా లోకేష్ పిలిచారు. ఏపీలో ప‌నిచేసిన 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం… అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని… అందుకే జగన్ మోహన్ పేరును ‘రిచ్ మోహన్’ గా మార్చానని అన్నారు.

This post was last modified on April 15, 2023 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

8 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

1 hour ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

1 hour ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago