ఏపీ సీఎం జగన్పై తరచుగా విరుచుకుపడే టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రాజకీయం పరంగా చూస్తే.. సీఎం జగన్కు ఆయన పలు పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సందర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపులర్ అయింది.
తర్వాత కాలంలో కరోనాతో పోలుస్తూ.. నారా లోకేష్ జగన్ను ఏకేశారు. “ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా వైరస్ను వదిలించుకునేందుకు నెల రోజులు క్వారంటైన్లో ఉంటే చాలు. కానీ, రాష్ట్రానికి పట్టిన ‘జగనో రా’ వైరస్ను వదిలించుకునేందుకు మరో మూడేళ్లు వెయిట్ చేయాలి” అని నారా లోకేష్ వ్యాఖ్యానించి.. చర్చనీయాంశం చేశారు. అదేవిధంగా జగన్ కాదు.. గజనీ అని పలుసందర్భాల్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్ మోహన్రెడ్డి కాదు.. ప్రజలను పీడిస్తున్న ‘జలగ’ మోహన్రెడ్డి అని పలు చోట్ల చెప్పుకొచ్చారు.
ఇక, పలు సందర్భాల్లో ‘సైకో రెడ్డి’ , ‘జాదూ రెడ్డి’ అంటూ.. నారా లోకేష్ విజృంభించారు. ఇక, ఈ పరంపరలోనే.. తాజాగా సీఎం జగన్కు నారా లోకేష్ మరో పెట్టారు. ‘రిచ్ మోహన్’ అని నారా లోకేష్ పిలిచారు. ఏపీలో పనిచేసిన 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం… అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని… అందుకే జగన్ మోహన్ పేరును ‘రిచ్ మోహన్’ గా మార్చానని అన్నారు.
This post was last modified on April 15, 2023 11:09 am
అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని…
విజయ్ దేవరకొండకు 2026 ఎంతో కీలకమైన సంవత్సరం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని అతను.. ఈ ఏడాది…
పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయినే కానీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది సౌత్లోనే. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు…
తమిళంలో నంబర్ వన్ హీరో స్థానంలో ఉండగా సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్. వెళ్తూ వెళ్తూ ఆయన…
రేపు జన నాయకుడు విడుదలవుతోంది. ఇది కాదు అసలు విశేషం. ఏపీ తెలంగాణ కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7…
స్కూల్ లో చదివేటప్పుడు లెక్కల్లో కేవలం 51 మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టులో అయితే ఏకంగా ఫెయిల్ అయ్యాడు. ఎనిమిదో…