Political News

సీఎం జ‌గ‌న్‌కు కొత్త‌పేరు పెట్టిన నారా లోకేష్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై త‌ర‌చుగా విరుచుకుప‌డే టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో దూకుడుగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌కీయం ప‌రంగా చూస్తే.. సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ప‌లు పేర్లు పెడుతున్నారు. ఇప్ప‌టికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సంద‌ర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపుల‌ర్ అయింది.

త‌ర్వాత కాలంలో క‌రోనాతో పోలుస్తూ.. నారా లోకేష్ జ‌గ‌న్‌ను ఏకేశారు. “ప్ర‌పంచాన్ని ప‌ట్టుకున్న క‌రోనా వైర‌స్‌ను వ‌దిలించుకునేందుకు నెల రోజులు క్వారంటైన్‌లో ఉంటే చాలు. కానీ, రాష్ట్రానికి ప‌ట్టిన ‘జ‌గ‌నో రా’ వైరస్‌ను వ‌దిలించుకునేందుకు మ‌రో మూడేళ్లు వెయిట్ చేయాలి” అని నారా లోకేష్ వ్యాఖ్యానించి.. చ‌ర్చ‌నీయాంశం చేశారు. అదేవిధంగా జ‌గ‌న్ కాదు.. గ‌జ‌నీ అని ప‌లుసంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కాదు.. ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న ‘జ‌ల‌గ’ మోహ‌న్‌రెడ్డి అని ప‌లు చోట్ల చెప్పుకొచ్చారు.

ఇక‌, ప‌లు సంద‌ర్భాల్లో ‘సైకో రెడ్డి’ , ‘జాదూ రెడ్డి’ అంటూ.. నారా లోకేష్ విజృంభించారు. ఇక‌, ఈ ప‌రంపర‌లోనే.. తాజాగా సీఎం జ‌గ‌న్‌కు నారా లోకేష్ మరో పెట్టారు. ‘రిచ్ మోహ‌న్‌’ అని నారా లోకేష్ పిలిచారు. ఏపీలో ప‌నిచేసిన 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం… అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని… అందుకే జగన్ మోహన్ పేరును ‘రిచ్ మోహన్’ గా మార్చానని అన్నారు.

Satya

Recent Posts

తెలుగు కుర్రాడికి రజినీ సినిమాలో ఛాన్స్

తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…

10 hours ago

ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…

11 hours ago

రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…

13 hours ago

నా చేతులు నా ఇష్టం అంటే చేతులు విరుగుతాయి

ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…

13 hours ago

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13…

14 hours ago

వారణాసి మాట మార్చే ఛాన్స్ లేనట్టే

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…

14 hours ago