ఏపీ సీఎం జగన్పై తరచుగా విరుచుకుపడే టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రాజకీయం పరంగా చూస్తే.. సీఎం జగన్కు ఆయన పలు పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సందర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపులర్ అయింది.
తర్వాత కాలంలో కరోనాతో పోలుస్తూ.. నారా లోకేష్ జగన్ను ఏకేశారు. “ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా వైరస్ను వదిలించుకునేందుకు నెల రోజులు క్వారంటైన్లో ఉంటే చాలు. కానీ, రాష్ట్రానికి పట్టిన ‘జగనో రా’ వైరస్ను వదిలించుకునేందుకు మరో మూడేళ్లు వెయిట్ చేయాలి” అని నారా లోకేష్ వ్యాఖ్యానించి.. చర్చనీయాంశం చేశారు. అదేవిధంగా జగన్ కాదు.. గజనీ అని పలుసందర్భాల్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్ మోహన్రెడ్డి కాదు.. ప్రజలను పీడిస్తున్న ‘జలగ’ మోహన్రెడ్డి అని పలు చోట్ల చెప్పుకొచ్చారు.
ఇక, పలు సందర్భాల్లో ‘సైకో రెడ్డి’ , ‘జాదూ రెడ్డి’ అంటూ.. నారా లోకేష్ విజృంభించారు. ఇక, ఈ పరంపరలోనే.. తాజాగా సీఎం జగన్కు నారా లోకేష్ మరో పెట్టారు. ‘రిచ్ మోహన్’ అని నారా లోకేష్ పిలిచారు. ఏపీలో పనిచేసిన 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం… అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని… అందుకే జగన్ మోహన్ పేరును ‘రిచ్ మోహన్’ గా మార్చానని అన్నారు.
This post was last modified on April 15, 2023 11:09 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…