ఏపీ సీఎం జగన్పై తరచుగా విరుచుకుపడే టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రాజకీయం పరంగా చూస్తే.. సీఎం జగన్కు ఆయన పలు పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సందర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపులర్ అయింది.
తర్వాత కాలంలో కరోనాతో పోలుస్తూ.. నారా లోకేష్ జగన్ను ఏకేశారు. “ప్రపంచాన్ని పట్టుకున్న కరోనా వైరస్ను వదిలించుకునేందుకు నెల రోజులు క్వారంటైన్లో ఉంటే చాలు. కానీ, రాష్ట్రానికి పట్టిన ‘జగనో రా’ వైరస్ను వదిలించుకునేందుకు మరో మూడేళ్లు వెయిట్ చేయాలి” అని నారా లోకేష్ వ్యాఖ్యానించి.. చర్చనీయాంశం చేశారు. అదేవిధంగా జగన్ కాదు.. గజనీ అని పలుసందర్భాల్లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్ మోహన్రెడ్డి కాదు.. ప్రజలను పీడిస్తున్న ‘జలగ’ మోహన్రెడ్డి అని పలు చోట్ల చెప్పుకొచ్చారు.
ఇక, పలు సందర్భాల్లో ‘సైకో రెడ్డి’ , ‘జాదూ రెడ్డి’ అంటూ.. నారా లోకేష్ విజృంభించారు. ఇక, ఈ పరంపరలోనే.. తాజాగా సీఎం జగన్కు నారా లోకేష్ మరో పెట్టారు. ‘రిచ్ మోహన్’ అని నారా లోకేష్ పిలిచారు. ఏపీలో పనిచేసిన 30 మంది సీఎంలకు వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే అందులో ఒక్క జగన్ కే 51 శాతం… అంటే 510 కోట్ల రూపాయల ఆస్తి ఉందని ఆరోపించారు. మిగిలిన 29 మంది సీఎంల ఆస్తి కలిపితే రూ.500 కోట్లేనని… అందుకే జగన్ మోహన్ పేరును ‘రిచ్ మోహన్’ గా మార్చానని అన్నారు.
This post was last modified on April 15, 2023 11:09 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…