టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకప్పటి ఆయన వీర విధేయుడు.. మాజీ తమ్ముడు కొడాలి నాని తాజాగా భారీ సవాలు విసిరారు. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఇరవైమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు సామూహిక రాజీనామాలు చేస్తామన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా బాబు తన ఎమ్మెల్యేలతో కలిసి సామూహిక రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లగలరా? అని సవాలు విసిరారు. ఒకవేళ బాబు కానీ 20కి 20 సీట్లను ఎన్నికల్లో గెలిస్తే.. రాజధాని వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ.. టీడీపీ కానీ ఎన్నికల్లో ఓటమి పాలైతే మాత్రం మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలన్నారు.
గత ఎన్నికల్లో బాబు తీసుకున్న నిర్ణయాలతో విసుగుచెందిన ప్రజలు టీడీపీని ఓడించిన వైనాన్ని గుర్తు చేశారు. అదే పనిగా జూమ్ యాప్ లో చంద్రబాబు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క బాలయ్య మాత్రమే బాబు గెలిపించారన్నారు. టీడీపీకి కంచుకోటలా ఉండే ఉత్తరాంధ్రలో కూడా ఓటర్లు ఓట్లు వేయలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చోట లక్ష కోట్లతో రాజధానిని నిర్మించటం ఏ మాత్రం సరికాదని.. అది సాధ్యం కూడా కాదన్నారు. మరి.. ఈ మాజీ తమ్ముడి సవాలుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on August 2, 2020 2:27 am
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…