Political News

కోర్టుకు వెళ్లాలంటే ట్రాఫిక్ ఇష్యూ

కోర్టుకు వెళ్లే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్సలు ఇష్టపడరు. కోర్టుకు హాజరయ్యేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. అన్నింటిని వాడుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడరు. తాను చెప్పే కారణాలకు సామాన్యుడు సైతం ప్రశ్నిస్తాడన్న విషయాన్ని ఆయన అస్సలు పట్టించుకోరు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి చేసిన కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

ఈ కోర్టు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జరుగుతోంది. గత వాయిదాలో ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు రావాలంటూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తాజాగా పిటిషన్ వేస్తూ.. తాను అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. తాను కోర్టు రాకపోవటానికి ప్రస్తావించిన కారణాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నానని.. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాల్ని నిర్వహించాల్సి ఉందని.. కోర్టుకు ముఖ్యమంత్రి హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. అందుకే అడ్వకేట్ కమిషనర్ ను నియమించి.. ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేసేందుకు వీలుగా వెసులుబాటు ఇవ్వాలని పేర్కొనటం గమనార్హం.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

7 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

8 hours ago