తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టబోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఫ్యాక్టరీని కొనుగోలు చేయటంలో తెలంగాణా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కేంద్రానికి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఇఓఐ) తెలియజేయబోతోందట. అలాగే వైజాగ్ వెళ్ళి ఫ్యాక్టరీ కొనుగోలుకు అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చి నివేదిక అందించమని కేసీఆర్ ఆదేశించారు.
ఇక్కడ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేబదులు తమకే కేటాయించమని జగన్ కేంద్రానికి లేఖరాసినా మోడీ పట్టించుకోలేదు. పైగా టాటా, పోస్కో లాంటి ప్రైవేటు యాజమాన్యాలు ఫ్యాక్టరీని పరిశీలించి వెళ్ళాయి. దాంతో ప్రైవేటుపరం చేయటానికి మోడీ ప్రభుత్వం డిసైడ్ అయ్యిందనే విషయం తేలిపోయింది. ఇక్కడే కేసీయార్ సీన్ లోకి ఎంటరయ్యారు.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సింగరేణి కంపెనీ తరపున కొనుగోలు చేయాలని కేసీయార్ అనుకున్నారట. దీనివల్ల తెలంగాణాకు, ఫ్యాక్టరీకి కూడా ఉపయోగమే. ఎలాగంటే స్టీల్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సింగరేణి నుండి అందుతుంది. అలాగే తెలంగాణాలో ప్రాజెక్టులకు అవసరమైన ఉక్కు తక్కువ ధరకే దొరుకుతుంది. కాకపోతే ఐరన్ ఓర్ గనులను కేంద్రం కేటాయించాలంతే. ఇది జరిగితే ఉక్కు ధరలు మరింతగా తగ్గిపోతాయి. కొంతకాలానికి ఫ్యాక్టరీ లాభాల బాట పడుతుంది.
ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే జగన్ ను ఇరుకునపెట్టచ్చు. ఎలాగంటే ఏపీకి సంబంధించిన ఫ్యాక్టరీని తెలంగాణా ప్రభుత్వం కొనుగోలు చేసిందంటే జనాలు ఎలా రియాక్టవుతారు ? ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వంపై ఉత్తరాంధ్రలో సానుకూలత మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇది రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా బీఆర్ఎస్ కు బాగా ఉపయోగపడుతుంది. అంతాబాగానే ఉంది మరి కేసీయార్ చేద్దామని అనుకుంటున్న పనినే జగన్ కూడా చేస్తే ? ఏపీ ప్రభుత్వం ద్వారానే స్టీల్ ఫ్యాక్టరీ కొనుగోలుకు జగన్ కూడా ప్రయత్నించ్చు కదా. ఏదేమైనా ముందుముందు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్లు జరిగే అవకాశముంది.
This post was last modified on April 10, 2023 10:03 am
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…