టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె ని దర్శకుడు నాగ అశ్విన్ ఎంత ప్యాషన్ తో తీస్తున్నాడో చూస్తున్నాం. సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ బయటికి రాకుండా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు వదలుతూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా రైడర్స్ పేరుతో 71 సెకండ్లున్న చిన్న బైట్ ని విడుదల చేసింది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, రైడర్స్ అంటే ఎవరు, హీరో ప్రభాస్ వాళ్ళతో ఏం చేయబోతున్నాడనే ఆసక్తికరమైన ప్రశ్నలు వదిలి అంతర్లీనంగా వాటికి సంబంధించిన క్లూస్ ఇచ్చారు.
వాటిని డీకోడ్ చేస్తే తేలేదేంటంటే రైడర్స్ అంటే విలన్ చుట్టూ ఉండే సూపర్ న్యాచురల్ గ్యాంగ్. మాములు మనుషులు కాదు. అవెంజర్స్ తరహాలో అతీత శక్తులతో తమ బాస్ ని కాపాడుతూ ఉంటాడు. వాడు చేసే దుర్మార్గాలను కాచుకుంటూ ఆదేశించడం ఆలస్యం ఎంత విధ్వంసమైనా సరే తెగబడతారు. ఈ గెటప్పులకు సంబంధించిన దుస్తులు మాస్కులు చాలా విచిత్రంగా ఉన్నాయి. హాలీవుడ్ స్టైల్ లో వాటికి ఏ మాత్రం తీసిపోని రీతిలో వీటిని సిద్ధం చేసిన విజువల్స్ ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 2 పేరుతో వచ్చిన వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది
ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోందన్న వార్తకు ఇప్పుడు బలం చేకూరింది. 2024 జనవరి 12 విడుదల చేస్తామని వైజయంతి మూవీస్ ఇప్పటికీ ప్రకటించింది కానీ నిజంగా ఆ డేట్ కి కట్టుబడి ఉంటారానే అనుమానం ఇంకా తొలగిపోలేదు. సలార్ తో పాటు ఇది కూడా రెండు భాగాలుగా వస్తుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీపీకా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ విజువల్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 10, 2023 12:43 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో…
రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్…
ఒకపక్క బాలీవుడ్ రామాయణంకు అడుగులు వేగంగా పడటంతో ఇంకోవైపు ఇలాంటి ఎపిక్ డ్రామాలను ప్లాన్ చేసుకున్న ఇతర హీరోలు, నిర్మాతలు…
ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా వేదికగా డిబేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారం చివరి…
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ గురించి…