Movie News

మంచి పనిని ఆలస్యంగా చేశారు

ఆస్కార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవముందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఒక తెలుగు సినిమా పాటకు వచ్చినప్పుడు అదో అంబరాన్ని తాకే సంబరమే అవ్వాలి. కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ పురస్కారాన్ని అందుకుని దేశానికి తిరిగి వచ్చాక అలాంటిదేమి కనిపించలేదు. పార్లమెంట్ లో సన్మానం చేస్తామని కొందరు ఎంపీలు ప్రకటించారు. దాని ఊసు లేదు. చంద్రబోస్, ఎంఎం కీరవాణిలను వ్యక్తిగతంగా కలుసుకోవడం లేదా పిలిపించుకోవడం ద్వారా పలువురు టాలీవుడ్ ప్రముఖులు వాళ్లను సత్కరించారు తప్ప అందరూ కలిసి నడుం బిగించింది ఏదీ లేదు.

సరే ఆలస్యమైతే అయ్యింది లెమ్మని నిన్న హైదరాబాద్ శిల్పా కళావేదికపై అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది కూడా ఆస్కార్ వచ్చిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత. తెలంగాణ ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అనిల్ తదితరులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఇండస్ట్రీకి సంబందించిన పెద్దలు ప్రముఖులు కనిపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు లేకపోవడం కొంత లోటుగానే అనిపించింది. సరే అక్కడ హైలైట్ అవ్వాల్సింది సంగీత దర్శకుడు, గీత రచయిత కాబట్టి హీరోలు లేకపోవడమే మంచిదనే లాజిక్ కరెక్టే.

నిజానికీ ఘనత భాషలతో సంబంధం లేకుండా దేశం మొత్తం వర్తిస్తుంది. కానీ బాలీవుడ్ మాకేం సంబంధం లేదన్న రీతిలో ఖాన్లతో సహా ఎవరికీ కనీసం ట్వీట్ చేసి కంగ్రాట్స్ చెప్పడానికి కూడా మనసు రాలేదు. నాటు నాటు విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. సరే లేట్ అయితే అయ్యింది ఇప్పుడైనా చేశారు కదాని సంతోషపడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంది. ఒకప్పుడు నంది అవార్డు వస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉండేది. అంతకు మించి ఇప్పుడు ఆస్కార్ వచ్చినా ఎందుకో ఆనందం కుదించుకుపోతోంది.

This post was last modified on April 10, 2023 12:43 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

20 minutes ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

3 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

6 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

6 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

6 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

7 hours ago