Movie News

మంచి పనిని ఆలస్యంగా చేశారు

ఆస్కార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవముందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఒక తెలుగు సినిమా పాటకు వచ్చినప్పుడు అదో అంబరాన్ని తాకే సంబరమే అవ్వాలి. కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ పురస్కారాన్ని అందుకుని దేశానికి తిరిగి వచ్చాక అలాంటిదేమి కనిపించలేదు. పార్లమెంట్ లో సన్మానం చేస్తామని కొందరు ఎంపీలు ప్రకటించారు. దాని ఊసు లేదు. చంద్రబోస్, ఎంఎం కీరవాణిలను వ్యక్తిగతంగా కలుసుకోవడం లేదా పిలిపించుకోవడం ద్వారా పలువురు టాలీవుడ్ ప్రముఖులు వాళ్లను సత్కరించారు తప్ప అందరూ కలిసి నడుం బిగించింది ఏదీ లేదు.

సరే ఆలస్యమైతే అయ్యింది లెమ్మని నిన్న హైదరాబాద్ శిల్పా కళావేదికపై అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది కూడా ఆస్కార్ వచ్చిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత. తెలంగాణ ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అనిల్ తదితరులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఇండస్ట్రీకి సంబందించిన పెద్దలు ప్రముఖులు కనిపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు లేకపోవడం కొంత లోటుగానే అనిపించింది. సరే అక్కడ హైలైట్ అవ్వాల్సింది సంగీత దర్శకుడు, గీత రచయిత కాబట్టి హీరోలు లేకపోవడమే మంచిదనే లాజిక్ కరెక్టే.

నిజానికీ ఘనత భాషలతో సంబంధం లేకుండా దేశం మొత్తం వర్తిస్తుంది. కానీ బాలీవుడ్ మాకేం సంబంధం లేదన్న రీతిలో ఖాన్లతో సహా ఎవరికీ కనీసం ట్వీట్ చేసి కంగ్రాట్స్ చెప్పడానికి కూడా మనసు రాలేదు. నాటు నాటు విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. సరే లేట్ అయితే అయ్యింది ఇప్పుడైనా చేశారు కదాని సంతోషపడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంది. ఒకప్పుడు నంది అవార్డు వస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉండేది. అంతకు మించి ఇప్పుడు ఆస్కార్ వచ్చినా ఎందుకో ఆనందం కుదించుకుపోతోంది.

This post was last modified on April 10, 2023 12:43 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago