Movie News

మంచి పనిని ఆలస్యంగా చేశారు

ఆస్కార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవముందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఒక తెలుగు సినిమా పాటకు వచ్చినప్పుడు అదో అంబరాన్ని తాకే సంబరమే అవ్వాలి. కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ పురస్కారాన్ని అందుకుని దేశానికి తిరిగి వచ్చాక అలాంటిదేమి కనిపించలేదు. పార్లమెంట్ లో సన్మానం చేస్తామని కొందరు ఎంపీలు ప్రకటించారు. దాని ఊసు లేదు. చంద్రబోస్, ఎంఎం కీరవాణిలను వ్యక్తిగతంగా కలుసుకోవడం లేదా పిలిపించుకోవడం ద్వారా పలువురు టాలీవుడ్ ప్రముఖులు వాళ్లను సత్కరించారు తప్ప అందరూ కలిసి నడుం బిగించింది ఏదీ లేదు.

సరే ఆలస్యమైతే అయ్యింది లెమ్మని నిన్న హైదరాబాద్ శిల్పా కళావేదికపై అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది కూడా ఆస్కార్ వచ్చిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత. తెలంగాణ ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అనిల్ తదితరులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఇండస్ట్రీకి సంబందించిన పెద్దలు ప్రముఖులు కనిపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు లేకపోవడం కొంత లోటుగానే అనిపించింది. సరే అక్కడ హైలైట్ అవ్వాల్సింది సంగీత దర్శకుడు, గీత రచయిత కాబట్టి హీరోలు లేకపోవడమే మంచిదనే లాజిక్ కరెక్టే.

నిజానికీ ఘనత భాషలతో సంబంధం లేకుండా దేశం మొత్తం వర్తిస్తుంది. కానీ బాలీవుడ్ మాకేం సంబంధం లేదన్న రీతిలో ఖాన్లతో సహా ఎవరికీ కనీసం ట్వీట్ చేసి కంగ్రాట్స్ చెప్పడానికి కూడా మనసు రాలేదు. నాటు నాటు విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. సరే లేట్ అయితే అయ్యింది ఇప్పుడైనా చేశారు కదాని సంతోషపడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంది. ఒకప్పుడు నంది అవార్డు వస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉండేది. అంతకు మించి ఇప్పుడు ఆస్కార్ వచ్చినా ఎందుకో ఆనందం కుదించుకుపోతోంది.

This post was last modified on April 10, 2023 12:43 pm

Share
Show comments

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

28 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago