Political News

కవిత, సంజయ్ ఇద్దరికీ ఫోనే కీలకం

లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత నాలుగు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందు లేదు.. లేదంటూనే ఆమె తన పది సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. కట్ చేసి చూస్తే.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన విషయంలోనూ ఫోనే కీలకమని చెబుతున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, సిసోడియా సహా పలువురు ముందుజాగ్రత్తగా ఫోన్లు పగులగొట్టారని సీబీఐ, ఈడీ అప్పట్లో ఆరోపించాయి. చాలా రోజుల వరకు నిందితులు, అనుమానితులు సమాధానం చెప్పలేదు. వన్ ఫైన్ మాణింగ్ కవిత ఇంటి నుంచి బయటకు వచ్చి ఫోన్లను మీడియాకు చూపించారు. వాటిని ఈడీ కార్యాలయంలో సమర్పించిన రెండు రోజుల తర్వాత కవిత లీగల్ అడ్వయిజర్ అక్కడకు వెళ్లి వాటిని పరిశీలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వచ్చారు. స్కాముకు సంబంధించిన కీలక సమాచారం ఫోన్లలో ఉందని ప్రకటించిన ఈడీ … వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు..

ఇప్పుడు సంజయ్ కేసులో వరంగల్ సీపీ రంగనాథ్‌ కూడా ఫోన్ సంభాషణను ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ఎక్కడుందో తెలీదని సంజయ్ అంటున్నారని… ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని సీపీ చెబుతున్నారు. బండి సంజయ్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే.. పరీక్షా పత్రం షేర్ అయిన సమాచారం మొత్తం బయటకు వస్తుందని చెబుతున్నారు. పిల్లల సాయంతో ప్రశ్నాపత్రం తెచ్చుకున్నారని అంటూ…. అది బీజేపీ నాయకులకు చాలా మందికి షేర్ అయ్యిందన్నారు. దీని వెనుక కుట్ర, అవినీతిని బయటకు తీయాలంటే ముందుగా సంజయ్ ఫోన్ స్వాధీనం చేసుకుని అందులోని సమాచారాన్ని రిట్రైవ్ చేయాల్సి ఉంటుందని పోలీసులు అంటున్నారు. అందుకే సంజయ్ కస్టోడియల్ ఇంటరాగేషన్‌ అవసరమని పోలీసులు అభ్యర్థించడంతో కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి..

This post was last modified on April 6, 2023 8:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago