కరోనా తగ్గిందని పార్టీ ఇచ్చాడు.. మళ్లీ వచ్చింది

ఇండియాలో కరోనా కేసులు వందకు చేరువగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌లో ఆ కేసులు 20 లోపే ఉన్నాయి. ఐతే ఇప్పుడు ఇండియాలో కరోనా కేసులు 600 దాటగా.. పాకిస్థాన్‌లో రెట్టింపు సంఖ్యలో కరోనా బాధితులుండటం గమనార్హం. దీన్ని బట్టి పాకిస్థాన్‌లో ఈ వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిసిందే.

భారత్‌లోనే జనాలు ప్రభుత్వ సూచనల్ని ఆశించిన స్థాయిలో పాటించట్లేదు. నిర్లక్ష్య వైఖరితో కేసులు పెరిగేందుకు కారణమవుతున్నారు. ఇక పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు. అక్కడి జనాల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక కేసు ఉదాహరణ.

రావల్పిండికి చెందిన ఓ వ్యక్తికి రెండు వారాల కిందట కరోనా సోకింది. అతణ్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. అతను కోలుకున్నాడు. తర్వాత కరోనా టెస్టు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఇంటికి పంపించేశారు. ఐతే కరోనా నుంచి తాను కోలుకోవడాన్ని పెద్ద విజయంగా భావించిన ఆ వ్యక్తి 100 మంది స్నేహితులు, బంధువుల్ని పిలిచి పార్టీ ఇచ్చాడు.

ఐతే అందులో ఒక వ్యక్తికి కరోనా ఉండటం.. అతడితో ఈ వ్యక్తి సన్నిహితంగా మెలగడంతో మళ్లీ కరోనా సోకింది. ఆ ఇద్దరినీ మళ్లీ వైద్యుల పర్యవేక్షణలోకి పంపించారు. కోలుకున్నాక ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాలని పోలీసులు భావిస్తున్నారట.

ఈ సంక్షోభ సమయంలో అతడికి పార్టీ ఇవ్వడానికి వనరులు ఎలా సమకూరాయి.. ఇతడికి బుద్ధి లేకపోయినా కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి పార్టీ ఇస్తే రావడానికి ఆ వంద మందికి ఎలా మనసొప్పింది అన్నది అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 1230 దాకా ఉండగా.. పది మంది దాకా ప్రాణాలు వదిలారు.

Share
Show comments
Published by
satya

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

40 mins ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

3 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

4 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

4 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

5 hours ago