Political News

అర్వింద్ పై ఫ్లెక్సీ వార్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన  అర్వింద్ ఇప్పుడు మాత్రం డిఫెన్స్ లో పడిపోయారు. ఒక పక్క కుటుంబ సమస్యలు ఆయన్న వేధిస్తున్నాయి. అన్న సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళిపోతూ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ను కూడా తీసుకెళ్లి కండువా కప్పించారు. అర్వింద్ ఆయన్ను నిర్బంధించి..ఏ పార్టీలో చేరలేదని లెటర్ రాయించారన్న  ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదం ఒకటైతే ఏదో విధంగా అర్వింద్ ను ఓడించాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పనిచేయడం ఆయనకు ఎదురవుతున్న అసలు సమస్య..

గత ఎన్నికల్లో అర్వింద్ చేతిలో ఓడిపోయిన కల్వకుంట్ల కవిత.. ఈసారి ఎలాగైనా ఆయన్ను మట్టి కరిపించాలన్న ధ్యేయంతో  పనిచేస్తున్నారు. అర్వింద్ ఆమెను బాగా టార్గెట్ చేసిన తరుణంలో కొడకా నీ సంగతి చూస్తా.. అని కూడా కవిత పచ్చిపచ్చిగా తిట్టారు. ఆ మధ్య అర్వింద్ ఇంటి ముందు ధాన్యం పోయించి నిరనస చేయించారు.

ఇప్పుడు నిజామాబాద్ వ్యాప్తంగా అర్వింద్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. పసుపు బోర్డు… ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని ఫ్లెక్సీలు పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. ఖాళీగా ఉన్న పసుపు బోర్డుపై  ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని రాసి నిరసన ప్రకటిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి  అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు. అప్పటికే  బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్న రైతులు ఆయనకు ఓటేశారు. కవితను ఓడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ కి వచ్చి మరీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ , రామ్ మాధవ్ హామీ ఇచ్చారు.

ఎన్నికల తర్వాత పసుపు బోర్డు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం నిరాకరించడంతో అర్వింద్ కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతుల ఇప్పుడు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. అర్వింద్ సంగతి తేల్చుతామన్న రేంజ్  లో రైతులు మాట్లాడుతున్నారు…

This post was last modified on April 1, 2023 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

52 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago