వైవీ సుబ్బారెడ్డి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మైసూరా రెడ్డి. విజయసాయి రెడ్డి. సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఈ పేర్లు చదివినప్పుడు కొన్ని సారూపత్యలు కనిపిస్తాయి. నిజమే.. ఈ నేతలంతా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారే. అంతకు మించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నీ తామైనట్లుగా ఒక దశలో వ్యవహరించిన వారే. అదే సమయంలో.. అదంతా కొంతకాలమే. ఒక్కో సీజన్ లో ఒక్కొక్కరు అన్న చందంగా.. ఒకరి తర్వాత ఒకరిని తన సన్నిహితుడి స్థానాన్ని ఇచ్చేయటం జగన్ కు అలవాటుగా చెబుతారు.
పార్టీలో తన తర్వాతి స్థానం ఇచ్చే విషయంలో జగన్ ఒక విధానాన్ని ఫాలో అవుతుంటారని చెబుతారు. ఆ స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారన్న పేరుంది. అందుకు తగ్గట్లే.. ఆయనకు ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించి.. ఆ తర్వాత దూరమైన వారి జాబితాలోనే వైవీ మొదలుకొని విజయసాయి వరకు ఉంటారని చెప్పాలి. విజయసాయి తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారింది సజ్జల రామక్రిష్ణారెడ్డినే.
ఒక విధంగా చెప్పాలంటే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు అత్యంత సన్నిహితుడిగా.. నమ్మకస్తుడిగా ఎక్కువ కాలం నడిచిన వ్యక్తి సజ్జల అని చెబుతారు. అలాంటి ఆయనపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. అన్నింటికి మించి.. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బలు తగిలి వైసీపీ విలవిలలాడిపోతున్న వైనం తెలిసిందే.
ఈ మొత్తానికి కారణం అధినేత జగన్మోహన్ రెడ్డి అని ఒక్కరుఅనకుండా.. అందరూ మూకుమ్మడిగా సజ్జల పేరును ప్రస్తావిచంటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సజ్జలపైన సీఎం జగన్ కినుకుతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో అందరి నోటి నుంచి సజ్జల పేరు రావటం.. పార్టీకి దూరమవుతున్న వారంతా సజ్జల పేరును ప్రస్తావించి.. ఆయనపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేయటాన్ని జగన్ పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతానికి స్టేటస్ కోను మొయింటైన్ చేస్తున్నప్పటికీ అదెక్కువకాలం ఉండదన్నమాట వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సజ్జల స్థానం మారే అవకాశమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన సన్నిహితుడి స్థానాన్ని ఎప్పటికప్పుడు మార్చే అలవాటు ఉన్న జగన్.. తనకు అలవాటైన పని చేసే వీలుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 29, 2023 5:58 pm
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…