నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజున కొనసాగుతోంది. సెల్ఫీ విత్ లోకేష్ తో ప్రారంభమయ్యే రోజువారీ కార్యక్రమం తర్వాత కనీసం మూడు నాలుగు మీటింగులతో కొనసాగుతోంది మైనార్టీలు, బీసీలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్.. అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. పాలిచ్చే ఆవును తరిమేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నందునే ఈ సమస్య వచ్చిందని లోకేష్ అంటున్నారు.
టీడీపీ బీసీల పార్టీ అని, అన్న నందమూరి తారకరామారావు బీసీలకు పెద్ద పీట వేశారని లోకేష్ గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రజకులు, గీత కార్మికులు, పద్మశాలీలు,జాలర్లు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్పొరేషన్ల నిధులను స్వాహా చేశారని, టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులను కూడా ఆపేశారని ఆయన గుర్తు చేస్తున్నారు..
వైసీపీ నేతలు ఎస్సీ, ఎస్టీలపైనా…బీసీలపైనా దాడులు చేస్తున్నారన్నారు. బీసీ సామాజిక వర్గాలకు భద్రత లేకుండా పోయిందని లోకేష్ గుర్తు చేస్తున్నారు. మాట్లాడిన ప్రతీ చోట ఎవరెవరిపై, ఎక్కడ దాడి జరిగిందో చెబుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీల భద్రతకు చట్టం ఉన్నట్లే బీసీల భద్రతకు కూడా ఒక చట్టం తీసుకు వస్తామని లోకేష్ తెలిపారు. అధికారానికి వచ్చిన వెంటనే బీసీల భద్రతా చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెడతామన్నారు. అప్పుడు బీసీలపై దాడులు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు..
లోకేష్ తొందరపడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదీ వైసీపీకి లీకులు ఇచ్చినట్లే అవుతుందని అంటున్నాయి. లోకేష్ ప్రకటనలతో అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం తామే ఆ చట్టాన్ని తీసుకువచ్చి లబ్ధి పొందే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. అందుకే కొన్ని వ్యూహాలు గోప్యంగా ఉంచడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి..
This post was last modified on March 29, 2023 1:49 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…