నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజున కొనసాగుతోంది. సెల్ఫీ విత్ లోకేష్ తో ప్రారంభమయ్యే రోజువారీ కార్యక్రమం తర్వాత కనీసం మూడు నాలుగు మీటింగులతో కొనసాగుతోంది మైనార్టీలు, బీసీలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్.. అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. పాలిచ్చే ఆవును తరిమేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నందునే ఈ సమస్య వచ్చిందని లోకేష్ అంటున్నారు.
టీడీపీ బీసీల పార్టీ అని, అన్న నందమూరి తారకరామారావు బీసీలకు పెద్ద పీట వేశారని లోకేష్ గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రజకులు, గీత కార్మికులు, పద్మశాలీలు,జాలర్లు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. కార్పొరేషన్ల నిధులను స్వాహా చేశారని, టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులను కూడా ఆపేశారని ఆయన గుర్తు చేస్తున్నారు..
వైసీపీ నేతలు ఎస్సీ, ఎస్టీలపైనా…బీసీలపైనా దాడులు చేస్తున్నారన్నారు. బీసీ సామాజిక వర్గాలకు భద్రత లేకుండా పోయిందని లోకేష్ గుర్తు చేస్తున్నారు. మాట్లాడిన ప్రతీ చోట ఎవరెవరిపై, ఎక్కడ దాడి జరిగిందో చెబుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీల భద్రతకు చట్టం ఉన్నట్లే బీసీల భద్రతకు కూడా ఒక చట్టం తీసుకు వస్తామని లోకేష్ తెలిపారు. అధికారానికి వచ్చిన వెంటనే బీసీల భద్రతా చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెడతామన్నారు. అప్పుడు బీసీలపై దాడులు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు..
లోకేష్ తొందరపడి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదీ వైసీపీకి లీకులు ఇచ్చినట్లే అవుతుందని అంటున్నాయి. లోకేష్ ప్రకటనలతో అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం తామే ఆ చట్టాన్ని తీసుకువచ్చి లబ్ధి పొందే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. అందుకే కొన్ని వ్యూహాలు గోప్యంగా ఉంచడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి..
This post was last modified on March 29, 2023 1:49 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…